Off The Record;కాంగ్రెస్ కు కొత్త తలనొప్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉన్న గొడవ సరిపోదని కొత్త తలనొప్పులు తెచ్చుకుంటుంది తెలంగాణ కాంగ్రెస్. ఇప్పటికే పీసీసీ కమిటీ.. ఫ్యామిలీ ప్యాక్ అయ్యిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కమిటీని జంబో ప్యాక్ చేస్తున్నారట. ఈ విషయంలో కొత్త ఇంచార్జి ఆలోచన ఏంటి? జంబో ప్యాక్తో సమస్యలకు ప్యాచప్ చేస్తారా?
Also Read
ఇప్పటికే 84 మంది పీసీసీ ప్రధాన కార్యదర్శులు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత కూర్పు గందరగోళంగా మారింది. క్షేత్రస్థాయిలో కమిటీల నియామకం ఎలా ఉన్నా… పిసిసి స్థాయిలో కమిటీల పంచాయితీ కంటిన్యూ అవుతుంది. 84 మందితో ప్రధాన కార్యదర్శుల జాబితా పార్టీలో పెద్ద దుమారం లేపింది. కొత్తవారికి ఎక్కువ పదవులు వచ్చాయని కొందరు.. పనిచేయని వారికి పదవులు ఇచ్చారని ఇంకొందరు గొడవ చేశారు. పార్టీ సీనియర్ నాయకులు ఏకంగా సేవ్ కాంగ్రెస్ అనే నినాదం వరకు వెళ్లారు. ఆ పంచాయితీ నుంచి ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ తెరుకుంటోంది. అయితే కొత్త ఇన్చార్జి వచ్చాక పెండింగ్లో ఉన్న జిల్లా అధ్యక్షులు నియామకంతోపాటు ప్రధాన కార్యదర్శుల సంఖ్య పెంచాలని.. కార్యదర్శుల పదవులు ఎప్పుడు భర్తీ చేస్తారనే డిమాండ్స్ తెరమీదకు వచ్చాయి. ఫిబ్రవరి మొదటి వారంలో పెండింగ్లో ఉన్న డీసీసీ నియామకం పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే పీసీసీ ప్రధాన కార్యదర్శులు.. కార్యదర్శుల పదవుల సంగతే అంతుచిక్కడం లేదట.
ప్రధాన కార్యదర్శుల పదవుల సంఖ్య పెంచుతున్నారా?
మొదట్లో 84 మంది ప్రధాన కార్యదర్శులు నియామకంపై అభ్యంతరాలు వచ్చాయి. కానీ ఇప్పుడు వీటి సంఖ్యను మరింత పెంచే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ప్రధాన కార్యదర్శి చొప్పున ఎంపిక చేశారు. కానీ నాయకుల మధ్య పోటీతో ఆ సంఖ్య 84 చేరింది. అసలైన వారికి అవకాశం ఇవ్వలేదనే విమర్శలు రావడంతో.. అందరినీ సంతృప్తి పరిచే పనిలో ఇంఛార్జ్ ఉన్నట్టు తెలుస్తోంది. 84 మంది ప్రధాన కార్యదర్శులకుతోడు ఇంకో 20 మందిని ఆ హోదాలో పీసీసీలోకి తీసుకుంటే నష్టం ఏముందనే ఫీలింగ్లో ఉన్నారు కొందరు నేతలు. 119 నియోజకవర్గాలకు ఒక్కో ప్రధాన కార్యదర్శిని నియమించాలని ఆలోచిస్తున్నారట. అలా 119 నియోజకవర్గాల బాధ్యతను ఒక్కో ప్రధాన కార్యదర్శికి అప్పగిస్తారట. ప్రధాన కార్యదర్శులే 119 మంది ఉంటే ఇక కార్యదర్శుల సంగతేంటి? పార్టీలో పనిచేసే వారి కంటే పదవుల్లో ఉండే వారి సంఖ్య ఎక్కువ అవుతోందనే సెటైర్లు వినిపిస్తున్నాయి. ప్రధాన కార్యదర్శి పదవులు పరిమితంగా ఉండాలి.. అవి ఇప్పుడు సెంచరీ కొట్టేస్తున్నాయి.
సమావేశాలకు రాని నేతల పదవులు పీకేస్తారా?
ఇప్పటివరకు పదవులు పొందిన నాయకులకు కోతపెట్టే పనిలో ఉంది పీసీసీ. వరుసగా మూడు సమావేశాలకు రాని నేతలు ఎవరైనా సరే.. వారిని పార్టీ పదవుల నుంచి తప్పించాలని ఇంచార్జికి సూచించారట. ఇదే విషయాన్ని సమావేశాల్లో కూడా చెప్పారట. ఓవైపు పని చేయని వారిని తగ్గిస్తామంటూనే ఇంకోవైపు 119 నియోజకవర్గాలకు ప్రధాన కార్యదర్శలను ఇంఛార్జులను నియమిస్తామనడం ఎలాంటి సంకేతాలు ఇస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Homemade Rose Water: లేడీస్ స్పెషల్.. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే రోజ్ వాటర్! గ్లోయింగ్ స్కిన్కు సింపుల్ సీక్రెట్ ఇదే..
-
Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
-
Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
-
IISc Study: ఆవు ఎంజైమ్తో ప్రమాదకర బ్యాక్టీరియాకు చెక్.. IISc సంచలన పరిశోధన
-
Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!