బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దిక్కుమాలిన సలహాలు తీసుకొనే కర్మ కాంగ్రెస్కి పట్టలేదు అని మాజీ మంత్రి పుష్ప లీల విమర్శించారు. స్త్రీ సమానత్వం గురించి మాట్లాడే నైతిక అర్హత కవితకి లేదని, కాంగ్రెస్ను ప్రశ్నించే హక్కు అస్సలే లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని ప్రశించటానికి ఉద్యమం చేస్తున్నట్టు లిక్కర్ రాణి ఫీల్ అవుతుందని ఎద్దేవా చేశారు. రైతులకి లేని అవకాశం ధర్నా చేయటానికి కవితకి ఒక్క రోజులో ఎలా దొరికింది? అని పుష్ప లీల ప్రశ్నించారు.…
ప్రధాని నరేంద్ర మోడీ కనికరంలేని రాజకీయ నాయకుడు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రధాని అధికారిక కార్యక్రమాలను ప్రారంభించేందుకు తెలంగాణ వచ్చారా? లేదా రాజకీయ సభల్లో పాల్గొనేందుకు వచ్చారా? అని మండిపడ్డారు. అధికారిక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధానిని పెద్దన్నగా కొనియాడితే.. మోడీ మాత్రం పార్టీ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారన్నారు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తారా? లేదా? ఎన్నికల ముందే చెప్పాలని, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను వెంటనే…
Woman strangled to death in Telangana: తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వీర్నపల్లి మండలం వన్పల్లి గ్రామంలో మల్లవ్వ (45) అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు అతికిరాతంగా గొంతు కోసి హత్య చేశారు. శుక్రవారం రాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు.. మల్లవ్వ గొంతు కోసి అతికిరాతంగా చంపేశారు. గొంతు కోయడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. మల్లవ్వ చుట్టుపక్కల పెద్దగా ఇళ్లులు లేకపోవడంతో దుండగుల పని ఈజీ అయింది. Also Read: IND…
15 Injured Khammam Road Accident: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూసుమంచి సమీపంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై లోక్యాతండా వంతెన వద్ద శనివారం తెల్లవారుజూమున ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం క్షతగాత్రులను 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రైవేటు బస్సు హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతుండగా…
Temperatures Increase in Telugu States: వేసవి ప్రారంభం అయింది. మార్చి ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. మొదటి వారంలోనే వేడి విపరీతంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల వరకు పెరిగాయి. తెలంగాణలోని పలు జిల్లాలలో శుక్రవారం (మార్చి 8) పగటి ఉష్ణోగ్రతలు దాదాపుగా 40 డిగ్రీల వరకు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో 35 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అంటే ఈసారి వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు ఏపీలోని…
లోక్ సభ ఎన్నికల అభ్యర్థులకు సంబంధించి మొదటి జాబితాపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేసింది. ఈరోజు.. 10 రాష్ట్రాల నుంచి దాదాపు 60 సీట్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది. తెలంగాణలో 9 మందితో మొదటి జాబితా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.