CM Revanth Reddy : వికారాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన దుద్యాల్ మండలంలోని పోలేపల్లి గ్రామానికి చేరుకుని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి పట్టు వస్త్రాలను సమర్పించిన సీఎం, భక్తులతో కలిసి ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం…
ఓపెన్ విత్ స్పాట్ సీఎం సీఎం నినాదాలు నిన్న కేసీఆర్ బీఆర్ఎస్ ఆఫీస్కు వచ్చినప్పుడు చేసినవి ఇవే.... ఈ నినాదాలే..... ఇప్పుడు బీఆర్ఎస్లో చర్చకు కారణం అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే... ఇదెక్కడి గోలరా...బాబూ... అంటూ పార్టీ పెద్దలే తలబాదుకుంటున్న పరిస్థితి. మామూలుగా అయితే... రాజకీయ నాయకులకు మీటింగ్స్లో ఇలాంటి నినాదాలు మాంఛి కిక్కు ఇస్తాయి. కానీ... బీఆర్ఎస్లో మాత్రం.... ఎవర్రా మీరు.... అసలెవర్రా మీరంతా.... అంటూ నినాదాలు చేస్తున్నవారిని కోపగించుకోవాల్సిన పరిస్థితి వస్తోందట.
ప్రధాని మోడీ – పవన్ కల్యాణ్ మధ్య ఆసక్తికర చర్చ.. ఏపీ డిప్యూటీ సీఎం ఏమన్నారంటే..? ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు.. ఎన్డీఏ కూటమిలోని కీలక నేతలు హాజరయ్యారు.. ఇక, ఇదే కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు.. అయితే, ఆ వేదికపై డిప్యూటీ…
తెలంగాణలో కొత్త రాజకీయ రగడ మొదలైంది. కాకుంటే... ఇది మత పరంగా సున్నితమైన అంశం కావడంతో... జాగ్రత్తగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు. ఇదే సమయంలో బీజేపీ డబుల్ స్టాండర్డ్స్ అనుసరిస్తోందన్న చర్చ సైతం మొదలైంది. త్వరలో రంజాన్ మాసం మొదలవబోతోంది. ఈ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాట్లు కల్పించాయి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు. ఆఫీస్ సాధారణ సమయం కంటే ఒక గంట ముందే... అంటే సాయంత్రం నాలుగు గంటలకే ముస్లిం ఉద్యోగులంతా విధులు ముగించుకుని వెళ్ళిపోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అదనంగా జాతీయ విపత్తు నిర్వహణ నిధి (NDRF) నిధులను ఇవ్వనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా బుధవారం ఈ నిధుల విడుదలకు ఆమోదముద్ర వేశారు. తెలంగాణతో పాటుగా ఐదు రాష్ట్రాలకు కలిపి రూ.1,554.99 కోట్లు విడుదల కానున్నాయి. ఇందులో తెలంగాణ వాటా కింద రూ.231.75 కోట్లు అందనున్నాయి. గతేడాది ఆయా రాష్ట్రాలకు విడుదల చేసిన ఎన్బీఆర్ఎఫ్ నిధులకు..
తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు సందడి చేయనున్నాయి. మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ జరుగబోతోంది. తెలంగాణ రాష్ట్రం మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. మే 7 నుంచి 31 వరకు మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్నాయి. గ్రాండ్ ఫినాలేతో సహా ప్రారంభ, ముగింపు వేడుకలు హైదరాబాద్లో జరగనున్నాయి. ప్రతిష్టాత్మకమైన ఈ మిస్ వరల్డ్ ఫెస్టివల్ కి 120 దేశాల నుంచి యువతులు పాల్గొననున్నారు. ఈ పోటీలకు సంబంధించిన అధికారిక ప్రకటనను మిస్ వరల్డ్ లిమిటెడ్ ఛైర్మన్,…