మంత్రి కేటీఆర్, బాలీ వుడ్ స్టార్ సోనూ సూద్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. కరోనా నేపథ్యంలో ఈ ఇద్దరు ప్రజల సమస్యలను తీరుస్తున్నారు. సోనూ సూద్ అయితే..కరోనా బాధితులు ఏ మూల నుంచి సహాయం కోరినా.. ఇట్టే చేసేస్తున్నాడు. ఇటు కేటీఆర్.. తెలంగాణ ప్రజలకే కాకుండా ఇతర రాష్ట్రాల వారికి అపన్నహస్తంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఈ ఇద్దరి మధ్యనే సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది. మంత్రి కేటీఆర్ను ట్విట్టర్…
హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రెండు ఆక్సీజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో నాలుగు ఆక్సీజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, తెలంగాణలో కూడా రెండు ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు నారా భువనేశ్వరీ తెలియజేశారు. అనాథ శవాలకు అంతిమ సంస్కారం ఏర్పాటుకు సేవా విభాగం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. టెలి మెడిసిన్, మందుల పంపిణీ, కరోనా రోగులకు…
ఏప్రిల్ 9 వ తేదీన షర్మిల కొత్త పార్టీని స్థాపిస్తున్నట్టు ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పేర్కోన్న సంగతి తెలిసిందే. పార్టీని ఏర్పాటు చేసే అంశంపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల నాయకులతో చర్చించారు. నాయకుల, వైఎస్ఆర్ అభిమానుల సలహాలు సూచనలు, అభిప్రాయాలు తీసుకున్నారు. జూన్ నెలలో పార్టీ పేరు, అజెండాను ప్రకటిస్తామని వైఎస్ షర్మిలా పేర్కోన్న సంగతి తెలిసిందే. ఇక, ఇదిలా ఉంటే వైఎస్ షర్మిల రేపు గజ్వేల్ నియోజక వర్గంలో పర్యటించనున్నారు. ఉద్యోగాలు లేక…
వరంగల్ సెంట్రల్ జైల్ తరలింపుకు రంగం సిద్ధమైంది. కేంద్ర కారాగారం స్థలాన్ని , వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. జైలు ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. జైలు స్థలంలో ఎంజీఎంను తరలించి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేడు జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది రానున్నారు. డీజీ సూచనలతో వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న 960 మంది…
తెలంగాణలో నేటి నుంచి ప్రారంభం కావాల్సిన ఇంటర్ ఆన్లైన్ తరగతులు లాక్ డౌన్ పొడిగింపుతో వాయిదా పడ్డాయి. మరోవైపు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ పేర్కొన్నారు. రేపటి నుంచి విద్యార్థులకు ఆన్లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. www.tsbie.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని వివరించారు. ఆన్లైన్ తరగతుల ప్రారంభ తేదీని త్వరలో ప్రకటిస్తామని జలీల్ తెలిపారు.
తెలంగాణలో కరోనా వైరస్ విలయం కొనసాగుతోంది. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 2524 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 578351 కి చేరింది. ఇందులో 5,40,986 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 34,084 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 18 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం…
కరోనా సెకండ్ వేవ్ సంక్షోభం సమయంలో పేదలను అండగా నిలిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. సడలింపులు ఉన్న రంగాలు తప్పితే.. లాక్డౌన్తో అంతా ఇళ్లకే పరిమితం అవుతుండడంతో.. పేదలకు తినడానికి తిండిలేక.. దాతల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉంది.. అయితే.. పేదల కడుపు నింపేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. జూన్ నెలలో ప్రతీ వ్యక్తికి 15 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందజేయనున్నారు.. దీంతో.. రాష్ట్రంలోని 2 కోట్ల 79 లక్షల 24 వేల 300…
రాష్ట్రంలో ధాన్యం సేకరణ పూర్తి స్థాయిలో జరుగుతుంది అని అసత్యాలు చెపుతున్నారు అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. కింటా దాన్యం కి 5 కిలల దాన్యం దోపిడీ చేస్తున్నారు. ప్రతి కింటా పై రైతులు 100 రూపాయలు నష్టపోతున్నారు అని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే రైతు బందు 5 వేలలో 2500 రూపాయలు మిల్లర్లు దోచుకుంటున్నారు. ప్రభుత్వం మిల్లర్ల ఆలోచనలకు అణుగుణంగా పని చేస్తుంది. ఎలెక్ట్రానిక్ వేవ్ బ్రీజ్ రసీదు పై దాన్యం కొనుగోలు…
తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో లాక్ డౌన్ అంశంతో పాటుగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మహబూబాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేటీఆర్ ట్వీట్ ద్వారా తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కేవలం నాలుగు మెడికల్ కాలేజీలు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పాడ్డాక కేసీఆర్…
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 1,801 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,75,827 కి చేరింది. ఇందులో 5,37,522 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 35,042 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 16 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన…