Home
Telangana
Telangana News
-
తమ్ముడు చేసిన పనికి చిక్కుల్లో మంత్రి..!
ఆయనో మంత్రి. వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా సొంత పార్టీవర్గాలే చెవులు కొరుక్కుంటాయి. ఏదో ఒక అంశంలో మంత్రి పేరు వినిపించడం కామన్. ఈసారి తమ్ముడు చేసిన పనివల్ల చిక్కుల్లో పడ్డారు. విపక్షాలకు మళ్లీ దొరికిపోయారు. దాంతో ఆ సమస్య నుంచి బయటపడేందుకు దారులు వెతుక్కుంటున్నారట అమాత్యుల వారు. మళ్లీ చర్చల్లోకి వచ్చిన మంత్రి మల్లారెడ్డి మంత్రి చామకూర మల్లారెడ్డి. ఈ పేరు చెప్పగానే రాజకీయవర్గాల్లో అనుకోకుండానే నవ్వు వచ్చేస్తుంది. ఆయన కామెడీ టైమింగ్ అలా ఉంటుంది మరి.… -
అందుకే కేసీఆర్ కేంద్రంపై మాట్లాడటం లేదు…
పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. 70 శాతం వరకు పన్నుల రూపంలో దోచుకుంటున్నారు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.కేంద్ర ప్రభుత్వ ముందు చూపు లేకపోవడంవల్లనే కరోనాను అరికట్టడంలో విఫలమయ్యారు. పీఎం కేర్ పేరుతో వేల కోట్లు వసూలు చేస్తున్నారు అని తెలిపారు. ముందుచూపు లేకపోవడం వల్లనే వ్యాక్సిన్ అందరికి వేయలేక పోయారు. సొంతంగా భారత దేశంలో వ్యాక్సిన్ తయారు అవుతున్నా. ఇక్కడి… -
జులై వరకు ఈ రైళ్లు రద్దు
కరోనా మహమ్మారి విజృంభణ.. మరోవైపు లాక్డౌన్లతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి.. ఇక, దూర ప్రాంతాలకు వెళ్లే వారి పరిస్థితి దారుణంగా తయారైపోయింది. రెగ్యులర్ సర్వీసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన పరిస్థితి లేదు.. ఇక, ఇదే సమయంలో.. దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.. ఈ నెల 21 తేదీ నుంచి జులై 1వ తేదీ వరకు ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది సౌత్ సెంట్రల్ రైల్వే.. ఈ నెల 21వ… -
విజన్ ఉన్న నేత రాహుల్.. ఏఐసీసీ పగ్గాలు చేపట్టాలి..
విజన్ ఉన్న నేత రాహుల్ గాంధీ.. దేశం కోసం ఆయన ఏఐసీసీ పగ్గాలు చేపట్టాలని కోరారు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క.. గాంధీభవన్లో జరిగిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని వ్యవస్థలను మోడీ సర్కార్ కూల్చి వేస్తోందని మండిపడ్డారు.. మాటలతో బతికే ప్రధాని మోడీ అని దుయ్యబట్టిన ఆయన.. యువత ఉద్యోగాలు లేక నిరాశతో ఉందన్నారు.. ఆస్తులు అన్నీ అమ్మకానికి… -
సంక్షోభం రాబోతోందని రాహుల్ గాంధీ ముందుగానే చెప్పారు…
ప్రజల క్షేమం విషయంలో అందరికంటే ముందు వరుసలో రాహుల్ గాంధీ గారు ఉన్నారు అని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ముందుగానే సంక్షోభం రాబోతోందని రాహుల్ గాంధీ ముందుగానే చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే గ్రహించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. రైతు మల్లారెడ్డి మనస్థాపానికి ఎందుకు గురయ్యారు. దానికి కెసిఆర్ తీసుకొస్తున్న ఇరీగేషన్ ప్రాజెక్ట్స్ కారణం అని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఒక్క రైతు న్యాయస్థానికి వెళ్లకుండా ప్రొజెక్ట్స్ నిర్మించిన ఘనత కాంగ్రెస్… -
బీబీ నగర్లో 35 మంది యువకులకు కరోనా.. క్రికెట్ మ్యాచే కారణం..!
కంటికి కనిపించని మాయదారి కరోనా మహమ్మారి ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా ఎటాక్ చేస్తోందో తెలియని పరిస్థితి.. అందుకే భౌతికదూరం పాటించాలని, మాస్క్ ధరించాలని, శానిటైజర్లు వాడాలని, గుంపులుగా ఉండొద్దని ఎంత ప్రచారం చేసినా.. కొందరు పెడచెవిన పెడుతూ కరోనా బారిన పడుతూనే ఉన్నారు.. తాజాగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకే కాలానికి చెందిన 35 మంది యువకులు కోవిడ్ బారినపడ్డారు.. తీరా ఆరా తీస్తే.. వాళ్లు అంతా కొద్దిరోజుల క్రితం క్రికెట్ మ్యాచ్ అడినట్టు చెబుతున్నారు..… -
కరోనాతో మావోయిస్టుల మరణం బూటకం.. అది పోలీసుల సృష్టే..!
కరోనా బారినపడి కొంతమంది మావోయిస్టులు మృతిచెందినట్టు ప్రచారం జరుగూతేఉంది.. అయితే.. కరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం.. కేవలం పోలీసుల సృష్టి మాత్రమే అంటున్నారు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ… ఇక, కరోనా సెకండ్ వేవ్ ప్రబలడానికి దేశ పాలకులే కారణం అని ఆరోపించారు ఆ పార్టీ అధికార ప్రధినిధి అభయ్.. కరోనా మహమ్మారితో మావోయిస్టుల మృతి అంటూ పోలీసులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ నిరభ్యంతరంగా, మావోయిస్టు కేంద్ర కమిటీ ఖండిస్తుందంటూ ఓ ప్రకటన… -
ప్రపంచంలోనే పెద్దాస్పత్రి.. 21న సీఎం కేసీఆర్ శంకుస్థాపన
బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. వరంగల్ మీడియాతో మాట్లాడిన ఆయన… ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు సెంట్రల్ జైలు స్థలంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేస్తారని వెల్లడించారు.. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరుగుతుందని.. అనంతరం వరంగల్ అర్బన్ జిల్లా నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారని.. ఆ తర్వాత కడియం శ్రీహరి ఇంట్లో మధ్యాహ్న బోజనం… -
యాదాద్రి: అడ్డగూడూరు పీఎస్లో మహిళ లాకప్ డెత్..!
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో లాకప్డెత్ సంచలనంగా మారింది.. పోలీసు దెబ్బలు తట్టుకోలేక మరియమ్మ అనే మహిళ మృతిచెందినట్టుగా తెలుస్తోంది.. ఇది ముమ్మాటికీ లాకప్ డెత్ అని మరియమ్మ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తి.. అడ్డగూడూరు మండలంలోని గోవిందాపురంలో ఫాదర్ బాలశౌరి ఇంట్లో రూ.2 లక్షలు చోరికీ గురయ్యాయి. పనిమనిషి మీద అనుమానంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు పాస్టర్.. మొదట మరియమ్మ, ఆతర్వాత ఆమె కొడుకు ఉదయ్ను అరెస్ట్ చేశారు పోలీసులు..… -
హైదరాబాద్లో నర్సు నిర్లక్ష్యం.. ఫోన్ మాట్లాడుతూ యువతికి 2 డోసుల వ్యాక్సిన్..!
కరోనా వైరస్కు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. క్రమంగా వ్యాక్సిన్ వేసుకోవడానికి మొగ్గు చూపుతున్నా.. కొన్ని భయాలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి.. అయితే, అక్కడక్కడ నర్సులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తోంది. హైదరాబాద్ శివారులో విధుల్లో ఉన్న నర్సు ఫోన్ మాట్లాడుతూ.. ఓ యువతికి ఒకేసారి రెండు డోసుల వ్యాక్సిన్ వేసింది.. కాసేపటికి కళ్లు తిరిగిపడిపోయిన ఆ యువతిని హుటాహుటిన ఆస్పత్రిలో చేర్చాల్సిన పరిస్థితి వచ్చింది.. వివరాల్లోకి వెళ్తే.. అబ్దుల్లాపూర్ మెట్ జెడ్పీహెచ్ వ్యాక్సినేషన్…
తాజావార్తలు
-
Tobacco Farmers: పొగాకు రైతులకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అండ.. కీలక ప్రకటన..
-
Lok Sabha: ఫలించిన స్పీకర్ చొరవ.. పేపర్ లీక్ నిరోధక బిల్లుపై రేపు చర్చ
-
AV Ranganath : హైడ్రా కమిషనర్ రంగనాథ్ రియాక్షన్.. ‘నిజం కోసం పోరాటం ఆగదు’
-
Trump: చర్చలు విఫలమైతే ఇరాన్పై భారీ దాడులుంటాయి.. ట్రంప్ వార్నింగ్
-
CXMT: ఈ IPO కొన్నవాళ్లకు పండగే పండగ.. లిస్టింగ్తోనే లక్షల్లో లాభాలు!
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!