ఇక నుంచి మనం టెన్షన్ పడడం కాదు.. సీఎం కేసీఆర్కు టెన్షన్ పెడదాం.. కసితో పనిచేయండి అంటూ గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ గ్రేటర్ కార్పొరేటర్లతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు కేసీఆర్, మంత్రులు ఇంకా అబద్ధాలు చెబుతూనే ఉన్నారని మండిపడ్డారు.. దుబ్బాకలో ప్రజలు ఓడించినా కేసీఆర్కు బుద్ధి రాలేదన్న ఆయన.. కేసీఆర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది.. సీఎంగా…
తెలంగాణలో ఇప్పటికే ఎంసెట్ సహా పలు సెట్లకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది రాష్ట్ర ఉన్నత విద్యామండలి.. ఇక, ఇవాళ టీఎస్ లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ను విడుదల చేశారు.. ఆగస్టులో ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనుండగా.. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 24వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రవేశ పరీక్షలు రాయాలనుకునే అభ్యర్థులు మార్చి 24 నుంచి మే 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చిన పేర్కొంది ఉన్నత విద్యామండలి.. ఇక, లేట్ ఫీతో జులై…
తెలంగాణ మణిహారం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో అద్భుతం ఆవిష్కృతం అయింది. మేఘా భూగర్భ ఇంజనీరింగ్ అద్భుతంతో గాయత్రి పంపింగ్ కేంద్రంలో మరో రికార్డ్ నమోదయింది. అనతికాలంలోనే భూగర్భ అద్భుతం గాయత్రి పంప్ హైస్ నుండి 100 టిఎంసీల ఎత్తిపోత ప్రారంభం అయింది. గాయత్రి పంప్ హౌస్ నుండి ప్రాణహిత నీటిని శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు తరలిస్తున్నారు. ఆగష్టు 8, 2019లో గాయత్రి పంప్ హౌస్ ను మేఘా ప్రారంభించింది. అత్యధికంగా 1703…
దేశవ్యాప్తంగా తగ్గినట్టే తగ్గిన కరోనా వైరస్ కొత్త పాజిటివ్ కేసులు సంఖ్య మళ్లీ పెరుగుతోంది.. కొన్ని రాష్ట్రాల్లో తక్కువ కేసులు ఉంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి.. మరోవైపు మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.. దీంతో.. పొరుగు రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి.. ముఖ్యంగా మహారాష్ట్రలో సెకండ్ వేవ్తో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి టెస్టులు నిర్వహిస్తున్నారు. ఆ రాష్ట్రం నుంచి తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్…