ఈటల రాజేందర్ జాయినింగ్ పై బిజెపి రాష్ట్ర నేతల క్లారిటీ ఇచ్చారు. ఈటల చేరికపై ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన బండి సంజయ్.. ఉద్యమకారులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఢిల్లీ పెద్దలకు చెప్పారు. ఉద్యమకారులకు కచ్చితంగా బిజెపి ప్రాధాన్యత, తగిన గౌరవం కూడా ఇస్తుందని బండి సంజయ్ కి చెప్పారు ఢిల్లీ పెద్దలు. ఈటల రాజేందర్ చేరికపై రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకున్న బండి సంజయ్..ఈటలను బిజెపిలో చేర్చుకోవాలని ఏకగ్రీవంగా తమ అభిప్రాయాన్నిచెప్పారు రాష్ట్ర బిజెపి ముఖ్య నేతలు.…
సమ్మె చేస్తున్న డాక్టర్లతో తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరపాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు & పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. డాక్టర్లకు కెసిఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని పేర్కొన్నారు. నోటితో మాట్లాడి …నొసటితో వెక్కిరించి నట్లు సిఎం కెసిఆర్ హామీలు ఉన్నాయని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మీ అధికారుల్లో చిత్త శుద్ధి లేదు.. చెత్త శుద్ధి ఉందని మండిపడ్డారు. డాక్టర్లు చేస్తున్న న్యాయ బద్ద సమ్మెను పరిష్కరించాలని..…
కరోనా కేసులు విలయం కొనసాగుతున్న నేపథ్యంలో.. పెట్రో ధరలు పెరుగుదల సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి.. కానీ, ఎప్పుడైతే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిందో.. అప్పటి నుంచి ఆగిపోయాయి.. కొన్ని సార్లు తగ్గాయి తప్పితే.. పెరిగింది మాత్రం లేదు.. అయితే, తాజాగా వాహనదారులకు పెట్రోల్ ధరలు షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్…
తెలంగాణలో లాక్డౌన్ ఆంక్షలు కోనసాగుతున్నాయి. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు లాక్డౌన్ ను అమలు చేస్తున్నారు. ఇక సరిహద్దుల వద్ద ఆంక్షలను మరింత కట్టుదిట్టం చేశారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పుల్లూరు టోల్ప్లాజా వద్ద ప్రైవేట్ వాహనాలను నిలిపివేశారు. ఈ పాస్ ఉంటేనే వాహనాలకు అనుమతి ఇస్తున్నారు. దీంతో టోల్ ప్లాజా వద్ద ట్రావెల్స్ బస్సులు, కార్లు అనేకం నిలిచిపోయాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర, సరుకు, అంబులెన్స్ కు…
తెలంగాణలో కరోనా కట్టడికి లాక్డౌన్ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపులు ఉన్నాయి. 10 గంటల నుంచి తిరిగి తెల్లవారి 6 గంటల వరకు లాక్డౌన్ అమలులో ఉంటుంది. కేవలం నాలుగు గంటల పాటు మాత్రమే సడలింపులు ఉన్నాయి. అయితే, మే 30 వ తేదీతో లాక్డౌన్ సమయం ముగుస్తుంది. మే 30 తరువాత లాక్ డౌన్ కొనసాగిస్తారా లేదంటే ఎత్తివేస్తారా అనే విషయంపై ఈ నెల…
కరోనా విజృంభణతో అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి.. అయితే, 12 వ తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్రాల అభిప్రాయం కోరింది కేంద్ర ప్రభుత్వం.. నేటితో ఆ గడువు కూడా ముగిసిపోయింది.. ఇంటర్ పరీక్షలతో పాటు.. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలపై తన వైఖరిని కేంద్రానికి తెలియజేసింది తెలంగాణ ప్రభుత్వం.. పరీక్షలు నిర్వహించాలన్న సీబీఎస్ఈ ప్రతిపాదనలకు ఓకే చెప్పింది.. పరిస్థితిలు చక్కబడితే జులై రెండో వారం తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంది… పరీక్ష…
తెలంగాణ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతారని ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన వ్యక్తులతో ఆయన వరుసగా భేటీలు నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ నేతల్ని కలిశారు. దీంతో ఈటల కాంగ్రెస్లో లేక బీజేపీలో చేరుతారా లేక కొత్త పార్టీని పెడతారా అంటూ రకరకాల చర్చలు రాష్ట్ర రాజకీయాల్లో మొదలయ్యాయి. అయితే, ఆయన బీజేపీలో చేరుతున్నారనే వార్తలకు, ఇటీవలే జరిగిన పరిణామాలు…
తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టారు జూనియర్ డాక్టర్లు.. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని.. రేపటి నుంచి అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే, జూడాలతో ప్రభుత్వం తరపున చర్చలు జరిపారు తెలంగాణ డీఎంఈ రమేష్ రెడ్డి… ఈ చర్చలు విఫలం అయినట్టుగా తెలుస్తోంది.. ప్రభుత్వం నుంచి సరైన హామీ రాలేదని చెబుతున్నారు జూనియర్ డాక్టర్ల ప్రతినిధులు.. రాతపూర్వకంగా హామీ ఇస్తేనే విధుల్లోకి చేరతామని చెప్పామని.. కానీ, ప్రభుత్వం…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కరోనా కేసులు తగ్గడంతో రెగ్యులర్ సేవలు ప్రారంభిస్తున్నాయి. కరోనా నెగిటివ్ వచ్చిన వారంతా త్వరగా కోలుకుంటుండటం, అత్యధికులకు ఐసీయూ బెడ్స్ అవసరం రాకపోవడంతో కరోనా అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇక కోవిడ్-19 ఆసుపత్రుల్లో చాలా పడకలు ఖాళీగానే ఉన్నాయి, ఆసుపత్రుల్లో రద్దీ కూడా ఎక్కువగా కనిపించడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్న…
జూనియర్ డాక్టర్ల సమ్మె విషయంలో సీఎం కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. అసలు, జూడాల సమ్మెకు కారణం ముఖ్యమంత్రియే నని.. కరోనభారిన పడే వైద్య సిబ్బంది వారి కుటుంబ సభ్యులు ఎక్కడ వైద్యం చేసుకుంటారు అంటే అక్కడ చేయించాలన్నారు.. జూడాలకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు బండి సంజయ్.. జూనియర్ డాక్టర్ లు ఈ సమయం లో సమ్మె చేయడం సరికాదు.. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు……