తెలంగాణ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు వందల దిగువకు చేరిన తర్వాత స్థిరంగా కొనసాగుతోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 453 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ముగ్గురు కరోనా బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 614 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం.
దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,49,859కు చేరుకోగా… కోలుకున్నవారి సంఖ్య 6,37,789కు పెరిగింది… ఇక, ఇప్పటి వరకు 3,828 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.14 శాతం ఉండగా.. దేశంలో 97.38 శాతంగా ఉందని.. ప్రస్తుతం 8,242 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. ఇవాళ ఒకేరోజు 80,658 శాంపిల్స్ పరీక్షించినట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 68 కేసులు, కరీంనగర్లో 43, వరంగల్ అర్బన్లో 36, ఖమ్మంలో 33 కేసులు నమోదయ్యాయి.