తెలంగాణలో కరోనా కొత్త కేసుల సంఖ్య మరింత కిందకు దిగివచ్చింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 58,261 శాంపిల్స్ పరీక్షించగా.. 259 మందికి పాజిటివ్గా తేలింది.. ఇవాళ మరో వ్యక్తి కోవిడ్బారినపడి మృతిచెందగా.. 301 మంది కరోనాబాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,62,785కు చేరగా.. రికవరీ కేసులు 6,53,603కి పెరిగాయి. ఇక, ఇప్పటి వరకు కోవిడ్తో 3,900 మంది ప్రాణాలు…
కేంద్రమంత్రులు వస్తుంటే తెలంగాణ బీజేపీ నేతలు ఉలిక్కి పడుతున్నారా? వారేం మాట్లాడతారో.. టీఆర్ఎస్ నేతల నుంచి ఎలాంటి స్టేట్మెంట్ వస్తుందో అని టెన్షన్లో ఉన్నారా? గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ నేతలు వ్యూహం మార్చారా? దానిపైనే ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందా? ఇంతకీ ఏంటా వ్యూహం? కేంద్రమంత్రుల ప్రకటనలతో బీజేపీకి ఇరకాటం! తెలంగాణ బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని.. వారిది గల్లీలో ఫైటింగ్.. ఢిల్లీలో దోస్తానా అన్నది వైరిపక్షాల విమర్శ. కాంగ్రెస్ దీనినే గట్టిగా…
హైదరాబాద్ ట్యాంక్బండ్లో గణేష్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఇప్పటి వరకు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.. ఇక, ఈ నెల 19వ తేదీన నిర్వహించే గణేష్ శోభాయాత్ర, గణేష్ నిమర్జనానికి చకచకా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.. నిమజ్జన ఏర్పాట్లకు ఉన్న అడ్డంకులు అన్ని తొలగిపోయాయని పేర్కొన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. శోభాయాత్ర, విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పోలీసు, ట్రాపిక్ పోలీసు, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఆర్ అండ్ బీ, ఎలక్ట్రికల్ తదితర అన్ని…
హుజారాబాద్ ఉప ఎన్నికలకు ఇంకా సమయం వుంది. ప్రధాన పక్షాలు దానిని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా శ్రేణులను సిద్ధం చేస్తోంది. ఈ ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ “విశ్వసనీయత” అంశాన్ని తెరమీదకు తెచ్చింది. దీని ద్వారా ఓటర్ల మనసు గెలవాలని గులాబీ ప్లాన్. టీఆర్ఎస్ ప్రయోగిస్తున్న “క్రెడిబిలిటీ కార్డుకు” విరుగుడుగా బీజేపీ “ఆత్మగౌరవం” నినాదాన్ని ముందుకు తెచ్చింది. దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. నాయకులను కొనుగోలు చేయొచ్చు…
తెలంగాణ కాంగ్రెస్లో హైకమాండ్ వేసిన PAC ఏం చేస్తుంది? ఇప్పటి వరకు PCC నిర్వహిస్తున్న సమావేశాలకు.. PACకి తేడా ఏంటి? కొత్త కమిటీనే రాజకీయ నిర్ణయాలు తీసుకుంటుందా.. లేక PAC ఉత్సవ విగ్రహంగా మారుతుందా? కాంగ్రెస్ పీఏసీ రాజకీయ నిర్ణయాలు చేస్తుందా? ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ రగులుతూనే ఉండటం తెలంగాణ కాంగ్రెస్లో కామన్. పార్టీలో చాలా మంది సీనియర్లకు పీసీసీ కొత్త కమిటీ తీసుకునే నిర్ణయాల్లో భాగస్వామ్యం లేదనే చర్చ ఉంది. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ…
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగుతోంది.. మొదటగా కోవిడ్ పరిస్థితిపై చర్చ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై వైద్యాధికారులతో కేబినెట్ ఆరా తీసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రా్లో కరోనా స్థితిగతులు, తీసుకుంటున్న చర్యలపై వైద్యాధికారులు కేబినెట్ కు సమాచారం అందించారు. ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి, నియంత్రణకు సంబంధించి సమాచారాన్ని సీఎం ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.. విద్యాసంస్థలు పునఃప్రారంభమైన అనంతర పరిస్థితులను కేబినెట్ కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖాధికారులు వివరించారు.…
తెలంగాణ ఆర్టీసీ బలోపేతంపై దృష్టిసారించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఈ మధ్యే టీఎస్ఆర్టీసీ ఎండీగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ను నియమించారు.. ఆయన క్షేత్రస్థాయిలో ఇప్పటికే ఆర్టీసీ పరిస్థితిపై అధ్యయనం మొదలు పెట్టారు.. ఇక, ఇవాళ ఆర్టీసీ చైర్మన్గా సీనియర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్రెడ్డిని నియమించారు సీఎం కేసీఆర్.. ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి.. సుదీర్ఘ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని.. కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సీనియప్ రాజకీయనేతగానే…
పార్టీ కమిటీల ఎంపికకు ముందే అధికారపార్టీ ఎమ్మెల్యేల మధ్య లొల్లి మొదలైందా? జిల్లాస్థాయి పదవులను తమ నియోజకవర్గానికే కేటాయించేలా ఎత్తుగడలు వేస్తున్నారా? ఈ విషయంలో ఎవరికి వారు చక్రం తిప్పుతున్నారా? ఇంతకీ ఏంటా పదవి? ఏమా గొడవ? అనుచరులకు పదవులు కట్టబెట్టే యత్నం? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాలుగు ముక్కలైన తర్వాత.. ఏర్పాటవుతున్న టీఆర్ఎస్ కమిటీలకు నలుగురు జిల్లా అధ్యక్షులు రాబోతున్నారు. ఈ విషయంలో జిల్లాల్లో కీలకంగా ఉన్న నాయకులు తెరవెనక పెద్ద మంత్రాంగమే నడుపుతున్నారట. మంత్రి…
సైదాబాద్ ప్రాంతానికి చెందిన చిన్నారిపై.. కామోద్రేకంతో రాజు అనే యువకుడు చేసిన పైశాచికత్వం.. యావత్ దేశాన్ని కదిలిస్తోంది. సామాన్యులనే కాదు.. సమాజంలోని సర్వ శక్తులూ.. ఆ బాధిత కుటుంబం వైపే చూసేలా చేస్తోంది. వారం రోజులుగా.. ప్రతి ఒక్కరూ.. ఆ వార్తనే ప్రసారం చేస్తున్న తీరుతో.. జనాల్లో భావోద్వేగం పెరుగుతోంది. ఈ తీరును గమనించిన రాజకీయ పార్టీల నేతలు సైతం.. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం చూస్తూనే ఉన్నాం. ఇక్కడే.. కొందరు ఓ విషయంపై…
అధికార పార్టీలో ఉన్నా.. అనుకోని పరిస్థితుల్లో మరో పార్టీలోకి చేరినా.. తన రూటే సెపరేటు.. అని ఇతరులు అనేలా నడుచుకుంటున్నారు.. మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. కొంత కాలం క్రితం వరకూ.. గులాబీ జెండా మోసి.. అజెండానూ అమలు చేసిన ఆయన.. అనుకోని పరిస్థితిలో కమలం బాట పట్టారు. కాషాయం గూటికి చేరారు. కానీ.. తన ఒరిజినాలిటీ మాత్రం కోల్పోయేది లేదు.. అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఒక్కసారి.. ఈటల టీఆర్ఎస్ నుంచి…