IPL 2026: ఐపీఎల్ 2026 కష్టమే.. ఆందోళనలో ప్రాంఛైజీలు!
- క్రీడా రంగాన్ని కలవరపెడుతోన్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం
- రాబోయే ఐపీఎల్ సీజన్పై ఆందోళనలు
- ఇప్పటికే శ్రీలంక-అఫ్గానిస్థాన్ సిరీస్ వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం క్రీడా రంగాన్ని కలవరపెడుతోంది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్ 2026 అనంతరం వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు స్వదేశం వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడటంతో.. రాబోయే ఐపీఎల్ సీజన్పై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ క్రికెటర్ల ప్రయాణంపై ప్రాంఛైజీలు ఆందోళనలో ఉన్నాయి.
వాయు మార్గాల మూసివేత కారణంగా డారెన్ సామి, క్వింటన్ డికాక్ వంటి దిగ్గజ ఆటగాళ్లు కోల్కతాలో చిక్కుకుపోయారు. ఇంగ్లాండ్ జట్టును ముందుగా పంపి.. తమను ఆలస్యం చేయడంపై ఐసీసీపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం దుబాయ్, దోహా వంటి కీలక రవాణా కేంద్రాల్లో విమానాలపై ఆంక్షలు ఉండటంతో.. ఈ నెల 28న ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం విదేశీ ఆటగాళ్లు సమయానికి చేరుకోవడం కష్టంగా మారింది. ఇప్పటికే శ్రీలంక-అఫ్గానిస్థాన్ సిరీస్ వాయిదా పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
Also Read
- Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
- Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
- US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
Also Read: Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?
ముఖ్యంగా వెస్టిండీస్, దక్షిణాఫ్రికా ఆటగాళ్ల రాకపై ఫ్రాంఛైజీలు ఆందోళన చెందుతున్నాయి. విమాన ఛార్జీలు భారీగా పెరగడం యాజమాన్యాలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతోంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ మాత్రం అకీల్ హోసిన్, బ్రెవిస్ వంటి ఆటగాళ్లు సకాలంలో జట్టుతో కలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు వంట గ్యాస్ కొరత కారణంగా జట్లకు ఆతిథ్యమిచ్చే హోటళ్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుత పరిస్థితులను పర్యవేక్షిస్తున్న బీసీసీఐ.. కేవలం మొదటి 20 మ్యాచ్లకు మాత్రమే షెడ్యూల్ను ప్రకటించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల ఎన్నికలు మరియు అంతర్జాతీయ ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని మిగతా షెడ్యూల్ను ఖరారు చేయనుంది.
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్ ఈ నెల 28న డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. రెండో మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరగనుండగా.. ముంబై, కోల్కతా ఢీకొట్టనున్నాయి. టోర్నీ వాయిదా పడుతుందనే ప్రచారాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కొట్టిపారేశారు. షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ జరుగుతుందని, ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి బోర్డు సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
-
YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్లతో ఎక్స్లో పోస్టులు!
-
Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్పై ఉపాసన రియాక్షన్!
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?