తెలంగాణ కాంగ్రెస్ లో చేరికల తుఫాన్ మొదలైంది. కాంగ్రెస్ లో ఇతర పార్టీ నేతలు చేరడంపై స్థానిక సీనిరయర్ నేతల్లో అసంతృప్తి ఎదురవుతోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేరికలపై వన్ మెన్ షో చేస్తున్నాడని విమర్శలు వెలువడుతున్నాయి. రేవంత్ రెడ్డి ఇటు సీనియర్లకు, అటు చేరికల కమిటీకి కూడా సమాచారం లేకుండానే తనంతకు తానే వ్యవహరించడం పై విమర్శలకు తావులేపుతోంది. జానారెడ్డికి చేరికల పరిశీలన కోసం చైర్మన్గా కమిటీ వేసిన విషయం తెలిసిందే. అయినా కానీ…
తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం భారీ వర్షాలు కురిసే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ, నైరుతి దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని తెలిపింది. మంచిర్యాల, ములుగు, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, సంగారెడ్డి, పెద్దపల్లి, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు వున్నట్లు పేర్కొన్నారు. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో వర్షాలు కురిసే…
ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆస్తులపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. నిలిపివేత ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని విద్యా శాఖ కార్యదర్శిని ఆదేశించారు మంత్రి సబిత
తెలంగాణలో ఇప్పటికీ ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిపై తర్జన భర్జన పడుతున్నారు అధికారులు.. దీంతో రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనే విషయంలో గందరగోళం ఏర్పడింది.. ఈ ఏడాది కూడా రిజల్ట్ తక్కువగా ఉంటే పరిస్థితి ఏంటనే భయం అధికారులను వెంటాడుతున్నట్టు తెలుస్తోంది
తెలంగాణలోని కొంత మంది సీనియర్ నేతల తీరు బండి సంజయ్కి ఇబ్బందికరంగా మారిందట.. వారి వ్యవహార శైలిపై ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.. అంతే కాదు.. ఢిల్లీ పెద్దల దగ్గర తన ఆవేదన వ్యక్తం చేశారట బండి సంజయ్.
ఫ్లిప్కార్ట్తో రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఎంవోయూ కుదుర్చుకుంది.. ఈ భాగస్వామ్యం ద్వారా, ఫ్లిప్కార్ట్ తన ప్లాట్ఫారమ్లో 400 మిలియన్లకు పైగా వినియోగదారులకు పాన్-ఇండియా మార్కెట్ యాక్సెస్ను అందించడం ద్వారా స్థానిక వ్యవసాయ సంఘాలు మరియు తెలంగాణలోని స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం తాను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.. తాను కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరుతాననేది ఊహాగానాలు మాత్రమే అన్నారు. ఈ రోజుకు తాను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని వ్యాఖ్యానించారు