Localbody Elections: తెలంగాణలో స్థానిక ఎన్నికల సందడి జోరుగ కొనసాగుతోంది. సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాలు కాగా లక్షల రూపాయలు వెచ్చించి పదవి దక్కించుకుంటున్నారు. అయితే.. ఈ ఎన్నికల్లో అనేక ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి. రక్త సంబంధీకులే పోటీ పడుతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గుంలాపూర్ గ్రామ సర్పంచ్ బరిలో అన్నాచెల్లెళ్లు పోటీగా నిలిచారు. సర్పంచ్ పదవిని ఎస్సీ జనరల్కు కేటాయించడంతో ఐదుగురు నామినేషన్లు వేశారు. బుధవారం గడువు…
Seethakka: బీఆర్ఎస్ దీక్షా దివాస్ కి మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు.బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజే దీక్షా దివస్ చేసేవాళ్లన్నారు.. అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏమీ లేదు.. అందుకే ఒక్క రోజుకి అప్పుడు దీక్షా దివస్ను పరిమితం చేశారని వ్యాంగ్యంగా స్పందించారు. మంత్రి సీతక్క తాజాగా నాంపల్లిలో మీడియాతో మాట్లాడారు. అధికారం పోయిన తర్వాత పది రోజులపాటు దీక్షా దివస్ పేరుతో నాటకాలు ఆడాల్సిన అవసరం ఏంటి? అని ప్రశ్నించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? ఎక్కడ తేడా కొట్టినట్టు పార్టీ పోస్ట్మార్టంలో తేలింది? వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు లోకల్ నాయకులు ఏమని రిపోర్ట్ ఇచ్చారు? వాళ్ళు బాగా హర్ట్ అయ్యారన్నది నిజమేనా? అసలు స్థానిక నేతల ఆవేదన ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న బీఆర్ఎస్… సీరియస్ పోస్ట్మార్టంలో పడిందట. అసలు గెలుస్తామని, లేదంటే గట్టి పోటీ ఇవ్వగలుగుతామని భావించిన భావించిన పార్టీ పెద్దలు… కాంగ్రెస్ అభ్యర్థికి అంత మెజార్టీ రావడాన్ని అస్సలు…
Kavitha: జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రస్తుతం మెదక్ పర్యటనలో ఉన్నారు. నిన్న(శనివారం) ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కేసీఆర్ మళ్లీ పార్టీలోకి పిలుస్తే వెళతారా..? అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారు. "కేసీఆర్ తండ్రిగా పిలిస్తే తప్పకుండా వెళతాను.. రాజకీయంగా పిలిస్తే ఎట్టి పరిస్థితుల్లో పోను.. ఏ పార్టీలోకి నేను ఎందుకు పోతాను.. ఫస్ట్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకురాలిని.. బీఆర్ఎస్ నుంచి గెంటి వేయబడ్డ నాయకురాలిగా..…
KTR: బంజారాహిల్స్ లో తమ పార్టీ తరుఫున గెలిచిన కార్పొరేటర్ను మేయర్ చేశామని.. ఆమెకు ఏమైందో ఏమో కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం "ఆహా నా పెళ్ళంట సినిమా కథ" లాగానే ఉందన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన పలువరు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అర చేతిలో వైకుంఠం చూపించి అధికారం…
KTR: బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతి పొందిందని.. 2014 నుంచి పదేళ్లలో హైదరాబాద్ను ఎంతో అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. షేక్ పేటలో BRS అభ్యర్థి తరుపున ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. 2014 కంటే ముందు ప్రతి అపార్ట్మెంట్ ముందు జనరేటర్లు ఉండేవి బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం ద్వారా జనరేటర్లు మాయమయ్యాయన్నారు. గంగా జమున తహసీబ్ సంస్కృతి ఉన్న ఇక్కడ ఎప్పుడు మతకల్లోలాలు…
మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బై ఎలక్షన్ లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఎల్లుండి సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్(డిల్లి లో) జరుగనుంది. తెలంగాణ జూబ్లీహిల్స్ అభ్యర్థి నీకేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఈ రోజు సమావేశం అయిన బీజేపీ ముఖ్య…
Ramchander Rao: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పై బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది.. బీజేపీ అభ్యర్థిపై చర్చించారు. మూడు పేర్లను సెంట్రల్ పార్టీకు పంపించనున్నారు. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి, రామ చందర్ రావు, అభయ్ పాటిల్, చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్ రావు మాట్లాడారు. జూబ్లీహిల్స్ గెలిచి నరేంద్ర మోడీకి గిఫ్ట్ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసింది.. బీసీలతో రాజకీయాలు చేసిందని విమర్శించారు.…