KTR: సికింద్రాబాద్ అస్తిత్వాన్ని చెరిపేందుకు కుట్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR:హైదరాబాద్, సికింద్రాబాద్ కు ఎంతో చరిత్ర ఉందని.. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని తొలగించే విధంగా చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తాజాగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో తుగ్లక్ గురించి పుస్తకాల్లో చదువుకున్నాం.. ప్రత్యక్షంగా తుగ్లక్ అంటే ఎలా ఉంటాడో కనిపిస్తుందని విమర్శించారు. మొట్టమొదటి పని టీఎస్ను టీజీగా చేశారు.. దీనివల్ల ఏ పేదవాడికి న్యాయం జరిగిందో తెలియదు.. తెలంగాణ తల్లిని తీసేసి కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి పెట్టారన్నారు. ప్రజల దగ్గరికి పాలన పోవాలని అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలని వీకేంద్రీకరణను ఒక విశాల దృక్పథంతోనే కేసీఆర్ ప్రారంభించారని.. కొత్త గ్రామాలు మండలాలు రెవెన్యూ డివిజన్లు జిల్లాలను ఏర్పాటు చేశారన్నారు. 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చారని.. హైదరాబాదులోనూ వార్డులను జోన్లను పెంచడం జరిగిందన్నారు. వాటికి అభివృద్ధి నిధులను కూడా అధికంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. హైదరాబాద్ సికింద్రాబాద్ అనేది తెలంగాణ ప్రజల గొప్ప అస్తిత్వం చిహ్నాలు.. కానీ రేవంత్ రెడ్డి తీసుకున్న తుగ్లకు నిర్ణయం వలన సికింద్రాబాద్కి చారిత్రక గుర్తింపు పూర్తిగా పోయేటట్లు ఉన్నదని అభిప్రాయపడ్డారు. సికింద్రాబాద్లోని అన్ని వర్గాల ప్రజలు ఒక్కటై.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. ప్రజలంతా సంఘటితమై.. మా పార్టీని ఆహ్వానించడం జరిగిందని.. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మొత్తం మా పార్టీకి చెందిన వార అన్నారు.
READ MORE: Rahul Gandhi: ఇండోర్లో అతిసార బాధిత కుటుంబాలకు రాహుల్గాంధీ పరామర్శ
Also Read
- Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్పై వాంగ్చుక్ భార్య విమర్శలు..
- Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
- Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
- WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
సికింద్రాబాద్లో పుట్టిన బిడ్డలుగా సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్నారు.. అధికారం ఇచ్చింది పట్టణాల అస్తిత్వాలను ప్రజల అస్తిత్వాలను గుర్తు లేకుండా చేరుపడం కోసం కాదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.. “అధికారం ఇచ్చింది గ్యారెంటీలను అమలు చేయడానికి అధికారం ఇచ్చింది ప్రజలు వారికి మంచి చేయాలని.. కానీ ఇలాంటి ఒక్క పని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేయడం లేదు.. హైదరాబాద్ నగరంలో రెండు సంవత్సరాలుగా ఒక్క ఇటుక కూడా పెట్టలేదు.. ఒక్క రోడ్డు కూడా వేయలేదు ఒక ఇల్లు కూడా కట్టలేదు.. కానీ నగరం మొత్తం తన విధ్వంసం ప్రణాళికలతోని ముందుకు పోతున్నారు.. ఈరోజు శాంతి ర్యాలీ పేరుతో సికింద్రాబాద్ ప్రజలు ప్రజాప్రతినిధులు ఒక కార్యక్రమాన్ని శాంతియుతంగా చేపట్టారు.. ప్రజల కోరిక మేరకు ప్రజాప్రతినిధులని కోరిక మేరకు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి వెళ్తామని సిద్ధంగా ఉన్నాం.. కానీ నిన్న రాత్రి వరకు అనుమతి ఉందని చెప్పి, ఇప్పుడు అనుమతి లేదని చెప్పి వేలాది మందిని కార్పొరేటర్లను, మాజీ కార్పొరేటర్ లను పార్టీ సీనియర్ నాయకులను సాధారణ ప్రజలను ఎక్కడికి అక్కడ అరెస్టు చేశారు.. ఇంత అరాచకంగా అక్రమంగా పనిచేస్తున్న ప్రభుత్వం అధికారం శాస్వతంగా కాదని గుర్తుపెట్టుకోవాలి.. ఇప్పుడున్న పదవిలో ఎల్లకాలం కొనసాగరు.” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్పై వాంగ్చుక్ భార్య విమర్శలు..
-
Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
-
Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
-
WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!