Shoib Akthar: అక్తర్ నోటి దురుసు.. వచ్చేవారం ఇండియా కూడా ఇంటికి రావడం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shoib Akthar: టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు ప్రమాదంలో పడ్డాయి. తొలి రెండు మ్యాచ్లలో ఓడటంతో తర్వాతి మూడు మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ గెలిచినా సెమీస్ అవకాశం దక్కుతుందన్న గ్యారెంటీ అయితే లేదు. పాకిస్థాన్ దాదాపుగా ఇంటికి వెళ్లినట్లే అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అద్భుతాలు జరిగితే తప్ప పాకిస్థాన్కు సెమీస్ అవకాశం దక్కేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ నుంచి వరుస ఓటములు ఎదుర్కొంటున్న పాకిస్తాన్పై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఫైర్ అవుతున్నాడు. తాజాగా టీమిండియాపై కూడా అక్తర్ తన అక్కసు వెళ్లగక్కాడు. తన జట్టు ఓడిపోతుందన్న బాధ కాకుండా టీమిండియా ఓడిపోవాలని కోరుకుంటున్నాడు. ఈ మేరకు భారత్ తీస్ మార్ ఖాన్ ఏం కాదని, వచ్చే వారమే ఆ జట్టు కూడా ఇంటికి వచ్చేస్తుందని అక్తర్ జోస్యం చెప్పాడు.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. 300 బంతులు ఆడగలనని ప్రపంచానికి చూపించాలి!
- Shubman Gill Record: శుభ్మన్ గిల్ అరుదైన రికార్డు.. సచిన్, సెహ్వాగ్ తర్వాత..!
- Saransh Jain Debut: ఐపీఎల్ ఆడకుండానే టీమిండియా డెబ్యూ.. మూడో ఆటగాడిగా సారాంశ్ జైన్ అరుదైన రికార్డు!
- Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
అటు టీ20 ప్రపంచకప్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ భవితవ్యం ఏంటో టోర్నీకి ముందే చెప్పానని షోయబ్ అక్తర్ గుర్తుచేశాడు. అందరూ అనుకున్నట్లుగానే పాకిస్థాన్ ఇంటిముఖం పట్టిందని.. టీమిండియాకు కూడా ఇదే గతి పడుతుందని అక్తర్ ప్రకటించాడు. అంటే టీమిండియా సెమీస్కు వెళ్లి అక్కడి నుంచి ఓడిపోయి ఇంటికి చేరుతుందని అక్తర్ అభిప్రాయపడుతున్నాడు. కానీ చాలా మంది అభిమానులు భారత్ ఈ ప్రపంచకప్ గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు పాకిస్థాన్ సెలక్టర్లు ఈ ప్రపంచకప్కు సరైన ఆటగాళ్లను ఎంపిక చేయలేదని అతడు ఆరోపించాడు. పీసీబీ దీనికి బాధ్యత వహించాలని అక్తర్ డిమాండ్ చేశాడు. కాగా జింబాబ్వే చేతిలో ఓటమిని పాకిస్థాన్ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. పాకిస్థాన్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ జింబాబ్వేతో మ్యాచ్ అనంతరం బోరున కన్నీటిపర్యంతమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షాదాబ్ ఖాన్ కింద కూర్చుని ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని బోరున విలపించడం వీడియోలో కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!