అత్త ఇంటికి కన్నం వేసిన అల్లుడిని పట్టుకున్నారు పోలీసులు. దీని పై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ… ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసు 24 గంటల్లో ఛేదించాము. 12 లక్షల నగదు తో పాటు, 1.5 కేజీ గోల్డ్.. మొత్తం విలువ 65 లక్షల విలువ అయిన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. జోగిని రంగమ్మ అనే 60 ఏళ్ల మహిళ ఇంట్లో వరుసకు అల్లుడు లక్ష్మన్ చోరీ చేసినట్టు ఫిర్యాదు…
రాష్ట్రంలో భారీ వర్షాల దృష్ట్యా రేపు సెలవుగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.. వర్షాలు మరో రెండు రోజుల పాటు పడే అవకాశం ఉండడంతో.. అన్ని పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు సీఎం కేసీఆర్.. అయితే, అత్యవసర సేవలకు సంబంధించినవారు మాత్రం విధుల్లో ఉండాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, వరదలు, ప్రస్తుత పరిస్థితిపై సీఎస్ సోమేష్ కుమార్తో సమీక్ష జరిపారు సీఎం కేసీఆర్.. ఇక, రేపు అసెంబ్లీ సమావేశాల్లో.. సభను నిర్వహించడంపై…