Off The Record: ఆధిపత్య రాజకీయాలకు పురిటిగడ్డ అనకాపల్లి. ఒకప్పుడు కొణతాల, దాడి కుటుంబాల మధ్య ఇక్కడ హోరాహోరీ పోరు నడిచేది. బలమైన గవర సామాజిక వర్గం డామినేషన్ కనిపించేది. 2009లో తొలిసారి ఆ రాజకీయానికి బ్రేకులు పడ్డాయి. స్ధానికేతర నాయకుల ఎంట్రీతో కుటుంబ రాజకీయాలు చెల్లిపోయాయి. పునర్విభజన తర్వాత కీలకమైన మునగపాక మండలం యలమంచిలిలో విలీనం అయింది. సరిగ్గా ఇక్కడి నుంచే అనకాపల్లి రాజకీయ ప్రయోగాలకు వేదికగా మారింది. అనకాపల్లి మున్సిపాలిటీ, మండలం, కశింకోట మండలం…
Off The Record: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా, నర్సాపురం లోక్సభ పరిధిలో కీలకమైన అసెంబ్లీ సెగ్మెంట్గా పేరున్న సీటు భీమవరం. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఒక్కసారిగా అందరి పొలిటికల్ అటెన్షన్ భీమవరం వైపు మళ్ళింది. అప్పుడు గెలుపు ఓటముల సంగతి వేరే స్టోరీ. తిరిగి మరోసారి ఎన్నికలు సమీపిస్తున్న టైంలో… ఇక్కడ పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. టీడీపీ, జనసేన మధ్య పొత్తు లాంఛనమేనన్న వాతావరణం ఏర్పడటంతో…
CPI Narayana: మోడీకి అభివృద్ధిపై ఫోకస్ లేదని.. ఆయనకు ఉన్నదల్లా అవినీతిపై మాత్రమే దృష్టి ఉందని సీపీఐ నారాయణ ఆరోపించారు. మోడీనే అసలుసిసలైన ఆర్థిక నేరస్తుడన్నారు.
Kesineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.. నిన్నటికి నిన్న పార్టీ శ్రేణులకు షాకిస్తూ వైసీపీ ఎమ్మెల్యేపై ప్రశంసలు కురిపించిన ఆయన.. ఈ రోజు కీలక కామెంట్లు చేశారు.. ఎంపీ టికెట్ లేకపోతే కేశినేని భవన్ లో కూర్చొని బెజవాడ ప్రజలకు సేవ చేస్తానని ప్రకటించారు.. రాజకీయాల్లో నేను, నా కుటుంబం జీవితాంతం ఉండాలని భావించే వ్యక్తిని కాదు.. మంచి పనులు ఎవరు చేస్తే వాళ్ళని నేను అభినందిస్తానని తెలిపారు.. వైసీపీ…
నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ బాగా పని చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు ఎంపీ కేశినేని నాని.. నందిగామలో అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది.. ఎమ్మెల్యే జగన్మోహన్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం పని చేస్తున్నారని కితాబిచ్చారు.. టీడీపీ, వైసీపీ సిద్ధాంతాలు వేరు అయిన అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తాం అని ప్రకటించారు ఎంపీ కేశినేని నాని.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి ఎన్ని ఎకరాలు ఇళ్ల పట్టాల కోసం ఇచ్చారో చెప్పాలంటూ చంద్రబాబును ఏపీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర ప్రశ్నించారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలసలో ఆయన చంద్రబాబుపై మండిపడ్డారు.
రూ. 2వేల నోట్ల రద్దుపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పందించారు. రూ. 2 వేల నోట్ల రద్దు వల్ల తనకు గానీ, వైసీపీ పార్టీకి కానీ ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. వైసీపీ పార్టీ పేదల పక్షమన్నారు. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడం ద్వారానే మేం ఎన్నికల్లో గెలుస్తాం.. డబ్బులతో కాదని ఆయన అన్నారు.