టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కామ్ ల రాజా అని, పాపం పండి నేడు పోలీసులు అరెస్టు చేశారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమే చంద్రబాబును అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారని, వారి ఆరోపణలలో వాస్తవం లేదన్నారు.
చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలు చేపట్టాలంటే గత నాలుగేళ్లు పట్టేదా అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే కక్ష సాధింపు చర్యలు చేపట్టే వాళ్లమని ఆయన పేర్కొన్నారు.
అయితే ప్రస్తుతం విచారణకు గంట పాటు లంచ్ టైం ఇచ్చారు. విరామం అనంతరం మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత కోర్టులో విచారణ తిరిగి స్టార్ట్ అవుతుంది. విచారణ జరుగుతున్న సమయంలో చంద్రబాబు కొడుకు లోకేష్ కూడా కోర్టులోనే ఉన్నారు. అయితే వాదనల అనంతరం ఏసీబీ న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం వెల్లడిస్తారు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అమరావతి అనేది చంద్రబాబు, లోకేశ్ బినామీలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి దోచుకున్నారు అనే విషయాన్ని తాము మొదటి నుంచి చెప్పుకుంటు వస్తున్నామని మంత్రి రోజా తెలిపారు.
పవన్ కళ్యాణ్ నడిరోడ్డుపై పడుకోవడంపై జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అవినీతి బాబుని అరెస్ట్ చేస్తే నీకు ఇదేమి కర్మ "BRO" అంటూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ ను పెట్టాడు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ముద్దాయి అని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నాకు ఏమీ లేదు అని చెప్పే చంద్రబాబు కోట్ల రూపాయలు వెచ్చించి ఢిల్లీ నుంచి లాయర్లను తెప్పించుకున్నారు.. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి మీద కేసు నమోదు చేస్తే అక్రమ కేసు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి వ్యాఖ్యానించడం సరికాదు
చంద్రబాబు అరెస్ట్ పై టీటీడీ పాలకమండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు తెలిసింది వెన్నుపోటు, పన్ను పోటు అని ఆరోపించారు.
జగన్ 16 నెలలు జైల్లో ఉండటం వలన కక్ష సాధింపు చర్యలతో అక్రమ అరెస్ట్ చేయించారని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోపించారు. చంద్రబాబు నాయుడుని పది నిమిషాలు అయినా సరే జైల్లో పెట్టాలని ఉద్దేశంతో అరెస్ట్ చేశారని తెలిపారు.
చంద్రబాబు అరెస్ట్ పై ఉదయం నుంచి వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబును సీఐడీ ప్రశ్నిస్తుంది. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు. చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టే అరెస్టయ్యాడని, అవినీతికి పాల్పడిన వ్యక్తిని జైలుకు పంపించకుండా ఎక్కడకు పంపిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్తో ఇప్పుడు ఎన్టీఆర్ ఆత్మ సంతోషంగా ఉంటుందన్నారు. ‘పిచ్చోడు లండన్కి… మంచోడు జైలుకి… ఇది కదా…