RK Roja: పక్కా ఆధారాలున్నాయ్.. చాలా స్కిల్డ్గా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా మండిపడ్డారు. స్కిల్ స్కామ్ పాత్రధారి, సూత్రధారి చంద్రబాబేనని రోజా ధ్వజమెత్తారు. చంద్రబాబు తన అధికారాన్ని దోపిడీ కోసమే ఉపయోగించుకున్నారని విమర్శించారు. అధికారాలున్నాయి కాబట్టే కోర్టు రిమాండ్కు పంపిందని తెలిపారు. స్కిల్ స్కామ్ జరగలేదని, తాను తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పగలిగారా అంటూ మంత్రి రోజా ప్రశ్నించారు. చంద్రబాబు లాయర్లు కుంటిసాకులపైనే వాదించారని అన్నారు. చంద్రబాబు దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాదని ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించారు. బోగస్ కంపెనీలతో దోచుకున్న కరప్షన్ కింగ్ అని మండిపడ్డారు. చంద్రబాబు అవినీతిలో కూరుకుపోయాడని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుపై కక్షసాధించే అవసరం తమకు లేదని తెలిపారు. వైఎస్ జగన్ పార్టీ పెట్టింది ప్రజల కోసమని పేర్కొన్నారు.
Also Read: Perni Nani: చంద్రబాబు ఎన్నో స్కామ్ లు చేశారు..
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
పక్కా ఆధారాలతో దొరికితే కొందరు గగ్గోలు పెడుతున్నారని మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీ అధికారులు చంద్రబాబుకు లేఖ రాసిన మాట నిజం కాదా అంటూ మంత్రి ప్రశ్నించారు. స్కిల్ స్కామ్లో ఈడీ విచారణ జరిపింది నిజం కాదా అంటూ ప్రశ్నలు సంధించారు. వ్యవస్థలను మేనేజ్ చేసుకొని ఇన్నాళ్లూ తప్పించుకున్నారన్నారు. దత్తపుత్రుడు చంద్రబాబు అవినీతిపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నలు గుప్పించారు టీడీపీ నేతలు, పవన్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. తప్పు చేసి ఇంకా బకాయిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ బంద్ను ప్రజలు పట్టించుకోలేదని మంత్రి రోజా చెప్పారు.. సాక్ష్యాధారాలతో దొరికిపోయి బంద్కు పిలుపునిస్తారా అంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పేరు చెబితే ఎన్నో పథకాలు గుర్తొస్తాయన్నారు. చంద్రబాబు పేరు చెబితే అన్ని స్కాంలే గుర్తొస్తాయన్నారు. చాలా స్కిల్డ్గా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చేశారన్నారు. అమరావతిలో భూముల్ని దోచుకున్నారని ఆమె విమర్శించారు. పోలవరం, పట్టిసీమ వరకు అవినీతి చేశారని, ప్రజల నెత్తిన టోపీ పెట్టి నిధులు దోచేశారన్నారు. కక్షసాధింపులకు పాల్పడిన చరిత్ర చంద్రబాబుది. చంద్రబాబు సానుభూతి రాజకీయాలు ప్రజలు నమ్మరని ఆమె వ్యాఖ్యానించారు.
జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ చంద్రసేనగా మార్చేశారని, అవినీతికి పాల్పడిన వ్యక్తికి ఆయన మద్దతిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ బంద్కు సపోర్టు చేయకున్నా పవన్ ఎందుకు మద్దతిచ్చారని ప్రశ్నించారు పవన్ పవర్ స్టార్ కాదు.. ప్యాకేజ్ స్టార్ అంటూ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అవినీతిపై గతంలో పవన్ మాట్లాడటం నిజం కాదా అంటూ ప్రశ్నించారు. ప్యాకేజీ కోసమే పవన్ చంద్రబాబుకు మద్దతిచ్చారని ఆమె పేర్కొన్నారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!