అమరావతిలో చంద్రబాబు అసెంబ్లీ ప్రసంగాలు పుస్తకావిష్కరణ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ పుట్టిన రోజు సందర్భంగా అసెంబ్లీ కమిటీ హాల్లో రెండు పుస్తకాలను రఘురామకృష్ణరాజు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆవిష్కరించారు. చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చేసిన ప్రసంగాలకు సంబంధించి, రెండు పుస్తకాలను జయప్రద ఫౌండేషన్ ప్రచురించింది. ఈ కార్యక్రమంలో పుస్తక రూపకర్త టీడీ జనార్ధన్ మాట్లాడారు.
నందమూరి బాలకృష్ణను కలిసిన ఎన్టీయార్ శతజయంతి కమిటీ గత ఆరునెలలుగా తాము నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించింది. 'జయహో ఎన్టీయార్' పేరుతో వెబ్ సైట్ ను, 'శకపురుషుడు' పేరుతో ప్రత్యేక సంచికను తీసుకు రాబోతున్నట్టు తెలిపింది.