ఉద్యమాల పురిటి గడ్డ వరంగల్ నుండి చిత్రసీమకు వచ్చిన వేణు ఊడుగుల తొలి యత్నంగా నాలుగేళ్ళ క్రితం ‘నీదీ నాదీ ఒకే కథ’ మూవీని తెరకెక్కించాడు. మళ్ళీ ఇప్పుడు ‘విరాట పర్వం’ సినిమాతో జనం ముందుకు రాబోతున్నాడు. శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ఖమ్మంకు చెందిన తూము సరళ జీవితం ఆధారంగా తెరకెక్కించినట్టు దర్శకుడు వేణు తెలిపాడు. అంతేకాదు… సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరంగల్ కు వెళ్ళినప్పుడు సరళ కుటుంబ సభ్యులనూ ఈ…