YSRCP: నేడు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ రాష్ట్రస్థాయి సమావేశం జరగనుంది. తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర రీజినల్ కో ఆర్డినేటర్లు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు హాజరుకానున్నారు.. పార్టీ బలోపేతం, పార్టీ నిర్మాణంపై దృష్టి సారించనున్నారు వైఎస్ జగన్.. పార్టీ పరంగా కమిటీల ఏర్పాటు, వాటి భర్తీపై చర్చించనున్నారు.. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా…
సోషల్ మీడియాలో గుట్టుగా చిన్నారులకు విక్రయాలు సాగిస్తోంది ఓ కిలాడీ మహిళ.. వాట్సాప్ ద్వారా ముక్కుపచ్చలారని చిన్నారులను అమ్మకానికి పెడుతోంది.. తాడేపల్లి నులకపేటలో ఓ వ్యక్తికి వాట్సాప్ లో కిలాడీ మహిళ ఆఫర్ పెట్టడంతో.. ఈ ఘటన వెలుగు చూసింది.
గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ ప్రేమోన్మాది. తన ప్రేమను అంగీకరించకపోవడంతో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. నర్సుగా పని చేస్తున్న కావ్య(23) అనే యువతిపై బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో కావ్యకు గాయాలు అయ్యాయి.
జగన్.. తాడేపల్లి, లోటస్ పాండ్ ఇళ్లకు రూ.50 కోట్ల ప్రభుత్వ ధనంతో ఫర్నిచర్ ఏర్పాటు చేసుకున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. " సీఎం హోదాలో తాను తీసుకున్న ఫర్నిచరును జగన్ తిరిగి అప్పగించ లేదు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని మార్చాలని వైసీపీ నిర్ణయించింది. ప్రస్తుతం జగన్ క్యాంపు కార్యాలయమును వైసీపీ పార్టీ కార్యాలయంగా మార్చాలని నిర్ణయం తీసుకుంది.
తాడేపల్లిలో గవర్నర్ ఆదేశాలతో సిట్ కార్యాలయాన్న తాళం వేశారు. సెక్రెటరీలు కార్యాలయాల్లోని డాక్యుమెంట్లను భద్రపరచాలని గవర్నర్ ఆదేశించారు. స్కిల్ డెవోలప్మెంట్ కేసు లో చంద్రబాబు ని అరెస్ట్ చేసిన సీఐడీ సిట్ ఆఫీస్ లో విచారించారు. ఒక వైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డాక్యుమెంట్లను సిట్ పోలీసులు దగ్ధం చేశారు. చంద్రబాబును అక్రమ కేసులో ఇరికించేందుకే ఈ తప్పుడు డాక్యుమెంట్లను సిద్ధం చేశారని టీడీపీ ఆరోపణలు చేసింది. డాక్యూమెంట్లు దగ్ధం…
గతంలో బైబై పేరుతో కౌంట్డౌన్ క్లాక్ ఏర్పాటు చేసినట్టుగానే.. ఇప్పుడు మరో 73 రోజుల్లో తిరిగి అధికారంలోకి వస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ''జగన్ అనే నేను'' పేరుతో కౌంట్డౌన్ క్లాక్లు ఏర్పాటు చేశారు..
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంట్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రైతులు, పల్లె ప్రజలతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం సీఎం జగన్కు ఆనవాయితీగా వస్తుంది. అయితే, ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.