హైదరాబాద్ శివార్లలోని చిలుకూరు పరిధిలో గల ఒక రిసార్ట్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒక పక్క పెళ్లి వేడుకతో బంధువులందరూ సందడిగా ఉన్న తరుణంలో, అనుకోని ప్రమాదం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ఆడుకుంటూ వెళ్లిన ఓ 15 ఏళ్ల బాలుడు స్విమ్మింగ్ పూల్లో పడి మృత్యువాత పడ్డాడు. చిలుకూరులోని ఒక ప్రైవేట్ రిసార్ట్లో బంధువుల పెళ్లి వేడుక జరుగుతోంది. ఈ శుభకార్యానికి హాజరైన సదరు బాలుడు, వేడుకలో అందరూ నిమగ్నమై ఉన్న సమయంలో ఆడుకుంటూ…