తమిళనాట దర్శకుడు బాలాకి మంచి క్రేజ్ ఉంది. వివాదాస్పద అంశాలతో హార్డ్ హిట్టింగ్ సినిమాలను చేస్తుంటాడు బాల. అందుకే స్టార్స్ కూడా తన సినిమాలో నటించటానికి ఆసక్తి చూపిస్తుంటారు. బాల చివరగా జ్యోతిక నటించిన 2018 థ్రిల్లర్ డ్రామా ‘నాచియార్’ ను తెరకెక్కించాడు. ఆ తర్వాత విక్రమ్ కుమారుడు తో చేసిన ‘వర్మ’ సినిమా నచ్చలేదని వేరే దర్శకుడుతో రీ-షూట్ చేసి విడుదల చేశారు. ప్రస్తుతం బాల మలయాళ ‘జోసెఫ్’ ఆధారంగా ‘విశిథిరన్’ అనే సినిమాను పద్మకుమార్…
కోలీవుడ్లోని ప్రముఖ నటీమణులలో జ్యోతిక ఒకరు. స్టార్ హీరో సూర్యను పెళ్లి చేసుకున్నాక కూడా ఆమె సందేశాత్మకమైన సామాజిక సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆలోచింపజేస్తోంది. అయితే ఆమె సోషల్ మీడియాకు మాత్రం దూరంగానే ఉన్నారు. దీంతో జ్యోతిక ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ కు సంబంధించిన అప్డేట్స్ సరిగ్గా లేకపోవడంతో ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం సాంకేతిక అభివృద్ధిలో భాగంగా సోషల్ మీడియా అనేది ప్రజల జీవితాల్లో ఒకటిగా మారిపోయింది. సెలెబ్రిటీలు సైతం ఎలాంటి సమస్యా లేకుండా…
దీపక్ సుందరరాజన్ దర్శకత్వం వహించిన “అన్నాబెల్లె సేతుపతి” హారర్ థ్రిల్లర్ లో విజయ్ సేతుపతి, తాప్సీ పన్ను ప్రధాన పాత్రల్లో నటించారు. రాధికా శరత్కుమార్, రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 17న డిస్నీ+హాట్స్టార్లో విడుదల కానుంది. “అన్నాబెల్లె సేతుపతి” సినిమాలో విజయ్ సేతుపతి మరియు తాప్సీ పన్నూ మొదటిసారిగా స్క్రీన్ షేర్ చేయబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ జైపూర్లో జరిగింది. ఒక నెలలోపే షూటింగ్ పూర్తయింది. ఈ మూవీ…
తమిళనాట కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు అగ్ర దర్శకులు. తెలుగులో యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ అందరూ కలసి గిల్డ్ పేరుతో సినిమాలు తీస్తున్నట్లు తమిళనాట అగ్రదర్శకులందరూ కలసి ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పారు. తెలుగులో నిర్మాతలు ఎవరికివారు హీరోలతో టై అప్ పెట్టుకుని సినిమాలు తీస్తుంటే తమిళంలో మాత్రం దర్శకులందరూ కలసి ఒకే గొడుగు కింద సినిమాలు తీయబోతున్నారు. మణిరత్నం, శంకర్, గౌతమ్ మీనన్, వెట్రిమారన్, మిస్కిన్, లింగుస్వామి, మురుగదాస్, బాలాజీ శక్తివేల్, శశి, లోకేశ్ కనకరాజ్…
సెలెబ్రిటీల పేర్లతో చీటింగ్ జరగడం చూస్తుంటే ఉంటాము. అయితే ఈసారి మాత్రం కేటుగాళ్లు రూటు మార్చి ఏకంగా స్టార్ హీరో నిర్మాణ సంస్థనే వాడుకున్నారు. సౌత్ ఫిల్మ్ స్టార్ సూర్య నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్ పేరును మోసగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. ప్రొడక్షన్ హౌస్ వారి సోషల్ మీడియా ఖాతాలో తమ నిర్మాణ సంస్థ పేరుతో జరిగిన మోసం గురించి షాకింగ్ వార్తను పంచుకుంది. ఒక మోసగాడు వారి లోగోతో పాటు నకిలీ ఇమెయిల్ ఐడిని సృష్టించాడు.…
తమిళ హీరో సూర్యకు తెలుగునాట కూడా చక్కటి గుర్తింపు ఉంది. తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని దక్షిణాదిలో టాప్ స్టార్స్ లో ఒకని గా పేరు తెచ్చుకున్నాడు. తన తాజా చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’ బాలీవుడ్ లోనూ రీమేక్ అవుతోంది. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నాడు సూర్య. తాజాగా ‘నవరస’తో డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేశాడు. ఇదిలా ఉంటే సూర్య ట్విట్టర్లో 7 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. Read Also :…
కరోనా మహమ్మారి సమయంలో ఓటిటీలో నేరుగా విడుదలైన మొదటి పెద్ద చిత్రం “సూరారై పొట్రు”. ఈ సినిమాపై అవార్డుల వర్షం కురుస్తోంది. తాజాగా మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులను ఈ మూవీ తన ఖాతాలో వేసుకుంది. షాంఘై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితం కావడమే కాకుండా ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ కోసం కూడా పరిశీలనకు వచ్చింది. 78వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో ప్రదర్శించబడే పది భారతీయ చిత్రాలలో ఒకటిగా ఎంపికైంది.…
దాదాపు 3 కోట్లు చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ సూర్య వేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు జడ్జి ఎస్ఎం సుబ్రమణ్యం తోసిపుచ్చింది. ఇటీవలే అగ్ర నటులు విజయ్, ధనుష్ తమ లగ్జరీ కార్ల కోసం ఎంట్రీ టాక్స్ మినహాయింపు కోరుతూ చేసిన విన్నపాలకు ఇలాంటి సమస్యలోనే చిక్కుకున్నారు. ఈ మూడు కేసుల్లోనూ జడ్జి ఎస్ఎం సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. 2007-2008, 2008-2009 ఆర్థిక సంవత్సరాలను పరిగణనలోకి తీసుకుని 2010 సంవత్సరంలో సూర్య…
కోవిడ్ ఇబ్బందులు ఇంకా పూర్తిగా పోలేదు. థియేటర్లు తెరుచుకున్నా, షూటింగ్ లు కొనసాగుతున్నా కరోనా కలవరం అందర్నీ వేధిస్తూనే ఉంది. ఇప్పుడు అదే సమస్య సూర్య, కమల్ హాసన్ మధ్య కూడా వచ్చింది. మహమ్మారి ఎఫెక్ట్ తో కమల్ హాసన్ కొద్ది రోజులు తన చిత్రాన్ని వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. అయితే, అందుక్కారణం హీరో సూర్య కావటమే కోలీవుడ్ లో చర్చగా మారింది. సూర్య ‘ఎతరుక్కుమ్ తునిందవా’ సినిమా చేస్తున్నాడు. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటిస్తున్న ప్రతి సినిమాను తెలుగులోనూ విడుదల అయ్యేలా చూసుకుంటాడు. ప్రస్తుతం ఆయన కెరీర్ లో 39వ చిత్రంగా వస్తున్న “జై భీమ్” సినిమాను ఓటీటీలోనే విడుదల చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా మేకర్స్ తెలియజేశారు. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సూర్య గిరిజన సంఘాల హక్కుల కోసం, వారి భూమి కోసం…