రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు ఎండలు మండుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకు వెళ్లాలంటే భానుడి భగభగలు చెమటలు పుట్టిస్తున్నాయి. అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లడం లేదు. ఇలాంటి పరిస్థితులతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. చాలా మంది త్వరగా అనారోగ్యం పాలవుతున్నారు. అయితే.. రోజువారీ పనులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా, ఆరోగ్యంగా ఉండాలంటే సమ్మర్ లో కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి. నిపుణులు చెబుతున్న ఈ జాగ్రత్తలు పాటించాలి.