Summer Tips: ఎండలు మండుతున్నాయ్ గురూ.. ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి, లేదంటే?
- తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- శ్రమ చేసే కార్మికులకు ప్రత్యేక జాగ్రత్తలు
- సాధ్యమైనంత వరకు నీడలో ఉండాలి
- శారీరక రక్షణపై ప్రత్యేక శ్రద్ధ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేసవి ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో 41 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండకు బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. తేమ శాతం తగ్గిపోవడంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేడి తీవ్రత వడదెబ్బకు దారి తీసే ప్రమాదముంది. చాలామంది చల్లని పదార్థాలను తీసుకునేందుకు ఇష్టపడతారు. ఎండాకాలంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు, శారీరక శ్రమ చేసే కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వడదెబ్బబారిన పడకుండా సాధ్యమైనంత వరకు నీడలో ఉండేలా చూసుకోవాలని, ఆహార నియమాలు, వస్త్రధారణ మార్పులు, శారీరక శ్రమను తగ్గించుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.
READ MORE: Maruti eVitara: మారుతి నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది.. సింగిల్ ఛార్జ్ తో 500 KM రేంజ్
Also Read
- Kitchen Cleaning Hacks: కడాయిపై పేరుకుపోయిన మొండి మురికి, జిడ్డు తొలగించే సహజ పద్ధతి.. అమ్మమ్మ చెప్పిన సీక్రెట్ ఇదే
- Monsoon Diet: ఆరోగ్యానికి మంచివే అయినా.. వర్షాకాలంలో ఈ కూరగాయలు ప్రమాదకరం..!
- Hair Growth Tips: జుట్టు గుత్తులు గుత్తులుగా రాలిపోతోందా?.. ఈ చిట్కాలు చాలు..
- Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ 'స్పైసీ చిల్లీ ఎగ్'.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
పారిశ్రామిక, ఆర్టీసీ, ఉపాధి, వ్యవసాయ, ఇతర రంగాల కార్మికులు ఎండ ప్రదేశాల్లో పని చేయాల్సి ఉంటుంది. వీరంతా శారీరక రక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పలుచని కాటన్ దుస్తులు ధరించాలి. సరైన భోజనం తీసుకుంటూ శక్తిని కాపాడుకోవాలి. ప్రొటీన్లు, ఐరన్, కాల్షియం కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. మసాలాలు, చక్కెర, ఉప్పు తగ్గించాలి. శరీర నొప్పులను తగ్గించుకునేందుకు తగినంత విశ్రాంతి తీసుకోవడం, వ్యాయామాలు చేయడం మంచిది. అతి చల్లని పదార్థాలు తీసుకుంటే దుష్ప్రభావాలు తప్పవు. శరీర ఉష్ణోగ్రతలకు అనుగుణంగా వాటిని తీసుకోవాలి. శీతల పానీయాలు, ఐస్క్రీములు తాత్కాలికంగా చల్లదనాన్ని కలిగించినా గొంతు ఇన్ఫెక్షన్లు, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. చల్లదనాన్ని కలిగించే కొబ్బరి నీరు, మజ్జిగ, బత్తాయి, ద్రాక్ష పండ్ల రసాలు, అరటి పండ్లు ఆరోగ్యానికి శ్రేయస్కరం.
READ MORE: Kamal Haasan : ఆ ఇద్దరూ నాకు ఐలవ్ యూ చెప్పలేదు.. కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్..
వేసవిలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు ఆహారం, జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తేలికపాటి ఆహారం తీసుకోవాలి. నిత్యం తగినంత నీరు తాగాలి. పొగ, మద్యం తాగడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. రక్తపోటు, మధుమేహం, గుండె, ఊపిరితిత్తుల సంబంధిత ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ నివారణ చర్యలు తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం, యోగా అభ్యాసం చేయాలి. నిద్ర సరిపోయేలా చూసుకోవాలి. శ్వాస సంబంధిత బాధితుల్లో ధూళి, పొగ, రసాయనాల కారణంగా ఊపిరితిత్తులు బలహీనపడే ప్రమాదం ఉంది. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ సమయం గడపకుండా జాగ్రత్తపడాలి.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!