India Bangladesh: బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ప్రభుత్వం కొలువుదీరింది. దీని అధ్యక్షుడు తారిక్ రెహ్మాన్ బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. గత రెండేళ్లుగా బంగ్లాదేశ్లో భారత వ్యతిరేకత, హిందూ విద్వేషాన్ని రెచ్చగొడుతున్న మహ్మద్ యూనస్ ఇక దిగిపోతున్నాడు. ఇదిలా ఉంటే, మతోన్మాద జమాతే ఇస్లామీ పార్టీ 300 స్థానాలకు గానూ 77 సీట్లను గెలుచుకుంది.
భారతదేశం ప్రతీకార చర్యతో పాకిస్థాన్ పూర్తిగా భయపడింది. మధ్యవర్తిత్వం కోసం అమెరికాను ఆశ్రయించింది. అమెరికా భారత్- పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించింది. పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించింది. భారత్-పాకిస్తాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.. "కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించాయి.. భారత్-పాకిస్థాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించాం.. రాత్రంతా భారత్-పాకిస్థాన్లతో చర్చలు జరిగాయి.. రెండు దేశాలకు నా అభినందనలు.. తక్షణమే కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి." అని ట్రంప్ పేర్కొన్నారు.