ఉక్రెయిన్పై రష్యా దాడుల కారణంగా అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే అతి పెద్ద ఐపీవోకు లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా సిద్ధం కాగా.. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను వాయిదా వేసింది. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ ఐపీవోను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఐపీవోను వాయిదా వేసేందుకు ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు,…
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్దమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఉక్రెయిన్ మూడు వైపుల నుంచి రష్యా బలగాలు చుట్టుముట్టడంతో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. అమెరికాతో పాటు యూరప్ దేశాలు శాంతి కోసం ప్రయత్నిస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధభయంతో అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలాయి. వాటి ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా పడింది. సోమవారం రోజున సెన్సెక్స్ 1700 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 17 వేల పాయింట్ల నుంచి 16900కి చేరింది. మార్కెట్లు అనుకూలంగా లేకపోవడంతో అన్నిరంగాల్లో షేర్ల అమ్మకాలు…
గతవారం దేశీయంగా స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి. అమెరికా ద్రవ్యోల్బణం, ఫెడ్ రెట్లు వంటి అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. దేశీయంగా టాప్ లిస్టులో ఉన్న కంపెనీలలో రిలయన్స్ మినహా మిగతా అన్ని కంపెనీలు భారీ నష్టాలను చవిచూశాయి. గతవారం టాప్ 9 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,03,532.08 కోట్ల మేర క్షీణించింది. టీసీఎస్ భారీగా నష్టపోగా, టాప్లో ఉన్న రిలయన్స్ మాత్రం భారీగా లాభపడింది. Read: Job: వర్క్ఫ్రమ్ హోమ్ చేస్తూ…
బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ఎవరి అజమాయిషిలో లేని క్రిప్టోకరెన్సీలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లకు అనుగుణంగా బిట్ కాయిన్ లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గత రెండు వారాలుగా ఈక్విటీ మార్కెట్ పుంజుకోగా దానికి అనుగుణంగా బిట్ కాయిన్ విలువ గరిష్టానికి చేరుకుంది. గురువారం నుంచి ఇప్పటి శనివారం వరకు బిట్ కాయిన్ విలువ 16శాతం మేర పెరిగింది. బిట్ కాయిన్తో పాటు బ్లాక్ చెయిన్ టెక్నాలజీకి అనుసంధనమైన ఈథర్ కాయిన్ విలువ కూడా పెరిగింది. బిట్…
ఎప్పుడూ లేని విధంగా స్టాక్ మార్కెట్లు ఈరోజు ఒక్కసారిగా కుప్పకూలాయి. మార్చి నెలలో వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉన్నట్టు అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యాంకు సూచించడంతో దాని ప్రభావం మార్కెట్పై పడింది. ఆసియా మార్కెట్తో పాటు ఇండియా మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. కేవలం 5 నిమిషాల వ్యవధిలో రూ. 4 లక్షల కోట్లు మదుపర్ల సంపద ఆవిరైంది. బాంబే స్టాక్ ఎక్చేంజ్ ప్రారంభమైన వెంటనే 1100 పాయింట్లు నష్టపోయింది. అమెరికాలో ద్రవ్యోల్భణం గరిష్టస్ధాయిలో ఉన్నప్పటికీ ఉద్యోగ విపణి…
ఈ ఏడాదిని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగించాయి. ఈరోజు ఉదయమే లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు లాభాలతోనే ముగించడం విశేషం. సెన్సెక్స్ 459.5 పాయింట్ల లాభంతో 58,253 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 150 పాయింట్లు లాభపడి 17,354 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్లో టైటాన్, ఆల్ట్రాటెక్ సిమెంట్స్, కొటక్ మహింద్రా బ్యాంక్, మారుతి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థల షేర్లు లాభపడ్డాయి. ఎన్టీపీసీ, టెక్ మహింద్రా, పవర్ గ్రిడ్, డాక్టర్…
కరోనా తరువాత ప్రైవేట్ సంస్థలు దూకుడుమీదున్నాయి. స్టాక్ మార్కెట్లలో సుమారు 50 కి పైగా కంపెనీలు ఐపీఓకి వచ్చాయి. రూ.1.1 లక్షల కోట్లు సమీకరించాయి. ప్రైవేట్ సంస్థల ఐపీఓలు భారీ ఎత్తున నిధులను సమీకరిస్తుండటంతో వచ్చే ఏడాది కూడా ఇదే దూకుడు ఉండేలా కనిపిస్తోంది. ప్రైవేట్ కంపెనీలు దూకుడును ప్రదర్శిస్తుంటే, ప్రభుత్వరంగ కంపెనీలు అవకాశాలను అందిపుచ్చుకోవడం లేదు. ఈ ఏడాది కేవలం రెండు ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి. కేవలం రూ. 5,500…
జీవితంలో పెళ్లి అన్నది ఒక మధురానుభూతి. పెళ్లిని వెరైటీగా చేసుకోవడానికి ఎక్కువమంది ఆసక్తి చూపుతుంటారు. పెళ్లి పనుల నుంచి పెళ్లి పత్రిక వరకు వైవిధ్యం కనబరచాలని చాలా మందికి ఉంటుంది. అయితే, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ లో పనిచేసే డాక్టర్ సందేశ్ తన పెళ్లి పత్రికను కూడా తన స్టాక్ మార్కెట్ భాషలో అచ్చువేయించాడు. పెళ్లి పత్రికలో వాడిన పదాలన్నీ స్టాక్ మార్కెట్లో నిత్యం వినే పదాలకు అన్వయించారు. వివాహ పత్రిక ఆహ్వానాన్ని ఐపీఓ గా పేర్కొన్నారు. …
ప్రపంచం మొత్తాన్ని ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం స్టాక్ మార్కెట్ సూచీలు కొంత ఆందోళన కలిగించాయి. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యాయి. అయితే, ఇది కేవలం అరగంట మాత్రమే అని స్పష్టమయింది. కోనుగోళ్ల తాకిడి పెరగడంతో సూచీలు భారీగా పుంజుకున్నాయి. రిలయన్స్ టారిఫ్ ధరలు పెంచడం, ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటాపై…