దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ 934 పాయింట్ల లాభంతో 52,532 వద్ద ముగియగా.. నిఫ్టీ 288 పాయింట్ల లాభంతో 15,638 వద్ద స్థిరపడింది. మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే ధోరణిని ప్రదర్శించాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఒక్క నెస్లే ఇండియా మాత్రమే నష్టాలను చవిచూసింది. మిగతా కంపెనీల షేర్లు లాభాలను గడించాయి. అత్యధికంగా లాభాలను గడించిన కంపెనీలలో టెక్ దిగ్గజాల షేర్లు ఉన్నాయి. విప్రో, ఇన్ఫోసిస్, టెక్…
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో వారాంతంలో స్టాక్మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ 1,016 పాయింట్ల భారీ నష్టంతో 54,303 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 276 పాయింట్ల నష్టంతో 16,201 వద్ద స్థిరపడింది. అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు రావడం, అంతర్జాతీయ సానుకూల సంకేతాలు లేకపోవడంతో ఉదయం నుంచే సూచీలు డీలాపడ్డాయి. దీంతో మదుపర్లు తమ షేర్లను అమ్మేందుకు సిద్ధపడ్డారు. Face Book: ఫేస్బుక్లో కీలక మార్పులు.. మారనున్న టికర్,…
నాలుగురోజుల వరుస నష్టాలకు ఈరోజు తెరపడింది. భారత స్టాక్మార్కెట్లు గురువారం నాడు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 427 పాయింట్ల లాభంతో 55,320 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 121 పాయింట్ల లాభంతో 16,478 వద్ద ముగిసింది. ఆర్బీఐ మానిటరీ పాలసీ విధానం ప్రభావం ఎక్కువేమీ స్టాక్ మార్కెట్లపై పడలేదు. మధ్యాహ్నం వరకు రేంజ్ బౌండ్లో కదలాడిన సూచీలు సాయంత్రానికి సర్రున పైకి ఎగిశాయి. దీంతో లాభాలను చవిచూశాయి. ఉదయం 10 గంటల సమయంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్…
రుతుపవనాల రాకతో స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ పెరిగింది. అయితే నిన్న లాభాలతో ప్రారంభమయిన దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. గత రెండు రోజుల భారీ లాభాలకు చెక్పెడుతూ సెన్సెక్స్ 500 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్లు నష్టపోయింది. ముడి చమురు ధరల పెంపు,అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఈ నష్టాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ (-477) 55448 వద్ద, నిఫ్టీ (-119) 16542 వద్ద కొనసాగుతున్నాయి. ఆటో, మెటల్, పీఎస్యూ బ్యాంక్, రియాల్టీ షేర్లు లాభపడగా. మరోవైపు ఐటీ,…
ఉక్రెయిన్పై రష్యా దాడుల కారణంగా అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే అతి పెద్ద ఐపీవోకు లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా సిద్ధం కాగా.. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను వాయిదా వేసింది. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ ఐపీవోను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఐపీవోను వాయిదా వేసేందుకు ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు,…
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్దమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఉక్రెయిన్ మూడు వైపుల నుంచి రష్యా బలగాలు చుట్టుముట్టడంతో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. అమెరికాతో పాటు యూరప్ దేశాలు శాంతి కోసం ప్రయత్నిస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధభయంతో అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలాయి. వాటి ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా పడింది. సోమవారం రోజున సెన్సెక్స్ 1700 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 17 వేల పాయింట్ల నుంచి 16900కి చేరింది. మార్కెట్లు అనుకూలంగా లేకపోవడంతో అన్నిరంగాల్లో షేర్ల అమ్మకాలు…
గతవారం దేశీయంగా స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి. అమెరికా ద్రవ్యోల్బణం, ఫెడ్ రెట్లు వంటి అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. దేశీయంగా టాప్ లిస్టులో ఉన్న కంపెనీలలో రిలయన్స్ మినహా మిగతా అన్ని కంపెనీలు భారీ నష్టాలను చవిచూశాయి. గతవారం టాప్ 9 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,03,532.08 కోట్ల మేర క్షీణించింది. టీసీఎస్ భారీగా నష్టపోగా, టాప్లో ఉన్న రిలయన్స్ మాత్రం భారీగా లాభపడింది. Read: Job: వర్క్ఫ్రమ్ హోమ్ చేస్తూ…
బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ఎవరి అజమాయిషిలో లేని క్రిప్టోకరెన్సీలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లకు అనుగుణంగా బిట్ కాయిన్ లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గత రెండు వారాలుగా ఈక్విటీ మార్కెట్ పుంజుకోగా దానికి అనుగుణంగా బిట్ కాయిన్ విలువ గరిష్టానికి చేరుకుంది. గురువారం నుంచి ఇప్పటి శనివారం వరకు బిట్ కాయిన్ విలువ 16శాతం మేర పెరిగింది. బిట్ కాయిన్తో పాటు బ్లాక్ చెయిన్ టెక్నాలజీకి అనుసంధనమైన ఈథర్ కాయిన్ విలువ కూడా పెరిగింది. బిట్…
ఎప్పుడూ లేని విధంగా స్టాక్ మార్కెట్లు ఈరోజు ఒక్కసారిగా కుప్పకూలాయి. మార్చి నెలలో వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉన్నట్టు అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యాంకు సూచించడంతో దాని ప్రభావం మార్కెట్పై పడింది. ఆసియా మార్కెట్తో పాటు ఇండియా మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. కేవలం 5 నిమిషాల వ్యవధిలో రూ. 4 లక్షల కోట్లు మదుపర్ల సంపద ఆవిరైంది. బాంబే స్టాక్ ఎక్చేంజ్ ప్రారంభమైన వెంటనే 1100 పాయింట్లు నష్టపోయింది. అమెరికాలో ద్రవ్యోల్భణం గరిష్టస్ధాయిలో ఉన్నప్పటికీ ఉద్యోగ విపణి…
ఈ ఏడాదిని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగించాయి. ఈరోజు ఉదయమే లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు లాభాలతోనే ముగించడం విశేషం. సెన్సెక్స్ 459.5 పాయింట్ల లాభంతో 58,253 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 150 పాయింట్లు లాభపడి 17,354 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్లో టైటాన్, ఆల్ట్రాటెక్ సిమెంట్స్, కొటక్ మహింద్రా బ్యాంక్, మారుతి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థల షేర్లు లాభపడ్డాయి. ఎన్టీపీసీ, టెక్ మహింద్రా, పవర్ గ్రిడ్, డాక్టర్…