సూపర్స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే! త్రివిక్రమ్ శ్రీనివాస్తో మహేశ్ చేయనున్న సినిమా ముగిసిన అనంతరం.. ఆ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది పట్టాలెక్కడానికి చాలా సమయమే ఉన్నప్పటికీ.. ఇందుకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ మాత్రం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమా దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతవరకూ…
దర్శకధీరుడు రాజమౌళి సినిమాల్లో భారీతనం ఎంతుంటుందో అందరికీ తెలుసు. నటీనటులు సైతం ప్రముఖులే ఉంటారు. చిన్న చిన్న పాత్రలకు కూడా ఆయన హేమాహేమీల్ని రంగంలోకి దింపుతాడు. అలాంటప్పుడు హీరోయిన్ విషయంలో ఇంకెంత కేర్ తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాలా? ఫలానా పాత్రకు సరిగ్గా సూటవుతుందా? లేదా? అని ఒకటికి పదిసార్లు లెక్కలేసుకొని.. స్టార్ హీరోయిన్లను రంగంలోకి దింపుతాడు. ఒకవేళ నిడివి చిన్నదైనా సరే, స్టార్లనే తీసుకుంటాడు. ఇప్పుడు మహేశ్ బాబు సినిమా విషయంలోనూ ఆ స్ట్రాటజీలనే జక్కన్న అనుసరిస్తున్నాడని…
సర్కారు వారి పాటతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన సూపర్స్టార్ మహేశ్ బాబు.. తన తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే! ఆ తర్వాత ఆయన దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఓ అడ్వెంచరస్ యాక్షన్ త్రిల్లర్ (SSMB29) చేయనున్నాడు. ఆర్ఆర్ఆర్తో జక్కన్న సూపర్ బ్లాక్బస్టర్ అందుకోవడం, మహేశ్ బాబుకీ జాతీయంగా మంచి క్రేజ్ ఉండడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు మించే ఈ సినిమాని తెరకెక్కించేందుకు జక్కన్న ప్రణాళికలు రచిస్తున్నాడని వార్తలొస్తున్నాయి.…
సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” అనే యాక్షన్ ఎంటర్టైనర్తో తన అభిమానులను, ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, “సర్కారు వారి పాట” మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ కు మంచి ఆదరణ లభించగా, సినిమాను వెండితెరపై వీక్షించడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు సూపర్…
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో ఓ సినిమా చేయనున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాత్కాలికంగా #SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. ఇప్పటికే జక్కన్న ఈ మెగా ప్రాజెక్ట్ బాహుబలి, ఆర్ఆర్ఆర్ లను మించి ఉంటుందని వెల్లడించి సినిమాపై హైప్ ని ఆకాశాన్ని తాకేలా చేశారు. ఇక తాజాగా జక్కన్న సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ను వెల్లడించారు. “ఆర్ఆర్ఆర్”తో మరో…
SSMB29 పై ప్రముఖ స్క్రీన్ రైటర్, దిగ్గజ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ క్రేజీ హింట్ ఇచ్చి మహేష్ అభిమానులను థ్రిల్ చేశారు. RRR సినిమా విడుదల సందర్భంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి విజయేంద్ర ప్రసాద్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. “మహేష్ సినిమా కోసం ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ కథను తీసుకోవాలి అనే ఆలోచన అయితే ఉంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ పూర్తి చేసిన తర్వాత స్క్రిప్ట్పై దృష్టి సారిస్తారు”…
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో ఓ సినిమా చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. తాత్కాలికంగా #SSMB29 పేరుతో పిలుచుకుంటున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. అయితే రాజమౌళి ఈ ప్రాజెక్ట్ కోసం మల్టీస్టారర్ కాన్సెప్ట్ను సిద్ధం చేశాడని ఊహాగానాలు వచ్చాయి. అంతేకాకుండా ఈ సినిమాలో ఓ అగ్ర నటుడు కీలక పాత్ర పోషించనున్నారని, సినిమాలో మరో ప్రధాన నటుడి ఎపిసోడ్ 40 నిమిషాల పాటు సాగుతుందని అన్నారు. పాన్ ఇండియన్ అప్పీల్ పొందడానికి…