టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ షూటింగ్ పనుల్లో వేగం పెంచారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ (SSMB29) కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ బాబు విదేశీ షెడ్యూల్ కోసం జార్జియాకు బయలుదేరారు. ఎయిర్పోర్ట్లో ఆయన భార్య నమ్రత శిరోద్కర్, కుమార్తె సితార ఘట్టమనేని ఆయనకు సెండాఫ్ ఇస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారాయి.…