Beautiful View of Srisailam Dam in Night: గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. మంగళవారం వరకు 5 గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు.. తాజాగా మరో ఐదు గేట్లను ఎత్తారు. దీంతో మొత్తంగా 10 గేట్ల ద్వారా నీరు దిగువన ఉన్న నాగార్జున సాగర్వైపు ప్రవహిస్తోంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి…
Telangana: తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టుల్లోకి వరద చేరుతోంది. దీంతో తెలంగాణలోని ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. కర్నాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో అమ్మవార్లు శాకంబరీ దేవీగా దర్శనం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి తెల్లవారు జాము నుంచే భక్తులు భారీగా తరలి వస్తున్నారు.
ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు జలాశయాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తోన్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గతవారం రోజులుగా కురుస్తోన్న వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణ్పూర్ జలాశయాలు నిండిపోయాయి. దీంతో నీటిని విడుదల చేస్తున్నారు.