ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఓ అరుదైన మైలురాయిని అందుకుంది. నేడు ఎస్ఆర్హెచ్ 200వ మ్యాచ్ ఆడుతోంది. ముల్లాన్పుర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్ సన్రైజర్స్కు డబుల్ సెంచరీ మ్యాచ్. ఇది ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీకి ఒక ప్రత్యేకమైన సందర్భం. 2013లో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఎస్ఆర్హెచ్.. ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో మార్పులు, కొత్త ఆటగాళ్లు వచ్చినా తన ప్రత్యేకతను నిలుపుకుంటూ ముందుకు సాగుతోంది. 2019లో సన్రైజర్స్ హైదరాబాద్ తమ 100వ…