అప్పుడే సంక్రాంతి రష్..! బస్సులు, రైళ్లన్నీ ఫుల్.. సంక్రాంతి పండగ దగ్గరపడుతుండటంతో విజయవాడ నుంచి రాకపోకలు సాగించే రైళ్లు, బస్సుల్లో భారీ రష్ మొదలైంది. పండుగకు కనీసం రెండు వారాల ముందు నుంచే రాకపోకలపై విపరీతమైన డిమాండ్ పెరగడంతో రిజర్వేషన్లు పూర్తిగా నిండిపోయాయి. సంక్రాంతి సెలవులను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు ముందస్తుగా బుకింగ్ చేసుకోవడంతో, జనవరి 10 నుంచి 14 వరకు అన్ని రైళ్లలో సీట్లు పూర్తిగా బుక్ అయిపోయాయి. వెయిటింగ్ లిస్ట్ భారీగా పెరిగిపోతోంది. జనవరి…
* విశాఖలో క్రికెట్ సందడి… కీలక సమరానికి సిద్ధమైన ఇండియా, సౌతాఫ్రికా జట్లు.. నేడు ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మధ్య జరగనున్న వన్డే మ్యాచ్.. మూడు వన్డేల సీరీస్ మ్యాచ్ లో చెరో మ్యాచ్ గెలిచిన ఇరు జట్లు.. సీరీస్ డిసైడ్ మ్యాచ్ కావడంతో ఉత్కంఠ… మధ్యహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్. * విశాఖలో మూడో వన్డే సందర్భంగా కట్టు దిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు… నేడు నగరంలో కొనసాగనున్న ట్రాఫిక్ ఆంక్షలు.. ముఖ్య…
* భారత్ పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్ లో పుతిన్ కు అధికారిక స్వాగతం.. రాజ్ ఘాట్ ను సందర్శించనున్న పుతిన్.. హైదరాబాద్ హౌజ్ లో భారత్ రష్యా శిఖరాగ్ర సమావేశం.. పలు అంశాలపై జరగనున్న ఒప్పందాలు.. భారత మండపంలో జరిగే ఫిక్కీ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి హాజరుకానున్న పుతిన్.. రష్యా ప్రభుత్వ చానెల్ ను భారత్ లో ప్రారంభించనున్న పుతిన్.. ఇవాళ రాత్రి రాష్ట్రపతి…
2026లో ప్రభుత్వ సెలవుల ఇవే.. ఉత్తర్వులు జారీ.. డిసెంబర్ నెలలోకి వచ్చేశాం.. త్వరలోనే 2025 ఏడాదికి బైబై చెప్పి.. 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అంతా సిద్ధం అవుతున్నారు.. ఇక, వచ్చే ఏడాది ఎప్పుడు సెలవులు ఉన్నాయి.. ఆ సెలవుల్లో ఏం ప్లాన్ చేసుకోవాలని ఎదురు చూసేవాళ్లు సైతం ఉన్నారు.. పబ్లిక్ హాలీడేస్లో ప్రభుత్వ కార్యాలయాలు, స్కూ్ళ్లకు కూడా సెలవులు ఉండడంతో.. వాటికి అనుగుణంగా ఇప్పుడే.. ప్రణాళికలు చేసుకునేవారు కూడా ఉన్నారు.. ఇక, ఈ నేపథ్యంలో…
వైఎస్ జగన్కు అచ్చె్న్నాయుడు సవాల్.. చర్చకు సిద్ధమా..? అబద్ధాలకు అంబాసిడర్గా వైఎస్ జగన్ వ్యవహరిస్తున్నారు అని ఆరోపణలు గుప్పించారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. వైఎస్ జగన్ చేస్తున్న నీచ ఆరోపణల గురించి రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అవగాహన ఉందని మంత్రి స్పష్టం చేశారు. కేవలం 18 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, జగన్ ఐదేళ్ల పాలనలో చేసిన అబద్ధాలను బట్టబయలు చేసిందని అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వని జగన్ మాట్లాడే…
వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి.. డీఎంహెచ్వో వివరణ స్క్రబ్ టైఫస్ వ్యాధి కేసులు టెన్షన్ పెడుతున్నాయి.. పల్నాడు జిల్లా డీఎంహెచ్వో రవికుమార్ స్క్రబ్ టైఫస్ కేసులపై వివరణ ఇచ్చారు.. జనవరి నుండి ఇప్పటి వరకు మొత్తం 11 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అయితే, ఈ వ్యాధి గురించి ప్రజలు అనవసరమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. డీఎంహెచ్వో రవికుమార్ వివరాల ప్రకారం, స్క్రబ్ టైఫస్ ప్రాణాంతక వ్యాధి కాదు.. ఇది ఒక రకమైన చిన్న…
అగ్గిపెట్ట కన్నా అరటి చవకగా మారింది.. ఆంధ్ర అరటి గురించి పార్లమెంట్లో చర్చించండి.. అగ్గిపెట్ట కన్నా అరటి చవకగా మారిపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎంపీ హర్షకుమార్.. అయితే, ఆంధ్ర అరటి గురించి పార్లమెంట్లో చర్చించండి అంటూ కాంగ్రెస్ ఎంపీ, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్కు లేఖ రాశారు.. ఆంధ్రప్రదేశ్లో అరటి పంటకు కిలో ధర కేవలం యాభై పైసలకు పడిపోవడం రైతులకు తీవ్ర ఆవేదన, ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఈ పరిస్థితిపై…
నకిలీ మద్యం తయారీ కేసులో మరో ట్విస్ట్.. ఆ కేసులోనూ నిందితులుగా జోగి బ్రదర్స్.. నకిలీ మద్యం తయారీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులోనూ మాజీ మంత్రి జోగి రమేష్.. ఆయన సోదరుడు జోగి రాము.. అంటే జోగి బ్రదర్స్ను నిందితుల జాబితాలో చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో భాగంగా, జోగి రమేష్, జోగి రాము పేర్లపై పీటీ వారెంట్ దాఖలు చేయగా, కోర్టు దీనికి అనుమతి…
CM Revanth: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాజకీయాలలో తిరుగులోని డెసిసిన్స్ తో ప్రతిపక్షాలను ఆడుకుంటున్న నేపధ్యంలో.. ఇప్పుడు ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) తో నిజమైన ఫుట్బాల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యారు. అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీని ఢీకొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. భారత పర్యటనలో భాగంగా అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీ ఈ నెల డిసెంబర్ 13న హైదరాబాద్ నగరానికి విచ్చేయనున్నారు. అదే…
ఐపీఎస్ సునీల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.. కాపులకు సీఎం.. దళితులకు డిప్యూటీ సీఎం..! సస్పెన్షన్ లో వున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పొలిటికల్ కామెంట్స్ మరోసారి వేడిని రాజేశాయి. కాపు, దళితులతో రాజ్యాధికారం ఫార్ములాను ప్రతిపాదించి మరోసారి సంచలనం సృష్టించారు. కాపులకు ముఖ్యమంత్రి పదవి.. దళితులకు డిప్యూటీ సీఎం కోసం ప్రణాళిక బద్ధంగా ఆలోచన చేయాలని సూచించారు సునీల్ కుమార్. ఆ దిశగా కాపులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆదివారం అనకాపల్లి…