Hardik Pandya: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన ప్రవర్తనతో వివాదంలో నిలిచాడు. శ్రీలంక ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో 11వ ఓవర్ పూర్తయిన తర్వాత వాటర్ బాయ్గా వాషింగ్టన్ సుందర్ మైదానంలోకి వచ్చాడు. అయితే తనకు వాటర్ ఇవ్వలేదని 12వ ఆటగాడైన వాషింగ్టన్ సుందర్పై పాండ్యా నోరుపారేసుకున్నాడు. నీళ్లు ఇవ్వకుండా ఎవడి ** *****? అంటూ హిందీ భాషలో బూతులతో రెచ్చిపోయాడు. పాండ్యా కామెంట్స్ స్టంప్ మైక్లో రికార్డు అవ్వడంతో ఈ…
Team India: కోల్కతా వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో అద్భుత విజయం సాధించిన టీమిండియా వన్డే సిరీస్తో పాటు ఓ అరుదైన ఘనతను కూడా సాధించింది. ఈ విజయంతో వన్డే ఫార్మాట్లో ఓ ప్రత్యర్థి జట్టుపై అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా టీమిండియా చరిత్రకెక్కింది. శ్రీలంకపై వన్డేల్లో భారత్కు ఇది 95వ విజయం. గతంలో న్యూజిలాండ్పై ఆస్ట్రేలియా సాధించిన 95 వన్డేల విజయ రికార్డును తాజాగా టీమిండియా సమం చేసింది. ఈ జాబితాలో భారత్-ఆస్ట్రేలియా సంయుక్తంగా…
Ranji Trophy: టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అతడిని సెలక్టర్లు మాత్రం కరుణించడం లేదు. ఈ నేపథ్యంలో రంజీ ట్రోఫీలో పృథ్వీ షా కసితీరా ఆడుతున్నాడు. అసోంతో జరుగుతున్న మ్యాచ్లో ఏకంగా ట్రిపుల్ సెంచరీతో రాణించి తనకు టీమిండియాలో స్థానం కల్పించాలంటూ పరోక్షంగా సంకేతాలు పంపించాడు. ఈ మ్యాచ్లో ఒక దశలో పృథ్వీ షా 400 పరుగులు చేస్తాడని అభిమానులు భావించారు. కానీ 379 పరుగులు…
Team India: టీ20 ఫార్మాట్లో ఐసీసీ నంబర్వన్ ఆటగాడిగా కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్కు విచిత్ర పరిస్థితి ఎదురవుతోంది. టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్నా అతడిని వన్డే ఫార్మాట్కు దూరంగా ఉంచడాన్ని పలువురు అభిమానులు సహించలేకపోతున్నారు. ఫామ్లో ఉన్న ఆటగాడిని జట్టులోకి తీసుకోకపోవడంపై మండిపడుతున్నారు. సూర్యకుమార్కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్యాయం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి స్థానంలో శ్రేయాస్ అయ్యర్కు అవకాశం కల్పించడాన్ని తప్పుబట్టలేకున్నా ఇది సరికాదని అభిప్రాయపడుతున్నారు. Read Also: Varisu: ట్విట్టర్ రివ్యూ… దిల్…
Virat Kohli: శ్రీలంకతో టీ20 సిరీస్కు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ వన్డే సిరీస్కు అందుబాటులోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో అతడిని కొన్ని రికార్డులు ఊరిస్తున్నాయి. ముఖ్యంగా సచిన్ సెంచరీల రికార్డుపై కోహ్లీ కన్నేశాడు. సొంతగడ్డపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ప్రపంచ రికార్డు ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ సొంతగడ్డపై 164 వన్డేలలో 20 సెంచరీలు చేశాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ సచిన్ రికార్డుకు కేవలం ఒక్క…
IND Vs SL: గౌహతి వేదికగా టీమిండియాతో జరగనున్న తొలి వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. అయితే వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. తుది జట్టులో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ లాంటి ఆటగాళ్లను తీసుకోలేదు. వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ను తీసుకోగా.. వన్డేల్లో నిలకడగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్కు అవకాశం కల్పించాడు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్మన్…
T20 League: టీ20 క్రికెట్లో మరో లీగ్కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో అభిమానులను టీ20 లీగ్లు అలరిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో బిగ్బాష్ లీగ్, ఇండియాలో ఐపీఎల్, పాకిస్థాన్ పీసీఎల్ వంటివి ఎంతో ఆదరణ పొందాయి. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో టీ20 లీగ్ ప్రారంభం అవుతోంది. నేటి నుంచి ఎస్ఏ20 పేరుతో లీగ్కు తెరలేవనుంది. సంక్షోభంలో చిక్కుకున్న దక్షిణాఫ్రికా క్రికెట్కు ఈ లీగ్ కొత్త ఊపిరి పోస్తుందని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు. ఈ లీగ్లో మొత్తం ఆరు…
IND Vs SL: శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ను గెలుచుకున్న టీమిండియా నేటి నుంచి మూడు వన్డేల సిరీస్లో తలపడనుంది. ఈ మేరకు గౌహతిలో తొలి వన్డే జరగనుంది. టీ20 సిరీస్కు దూరంగా ఉన్న సీనియర్ ఆటగాళ్లు వన్డే సిరీస్కు అందుబాటులో ఉండనున్నారు. రోహిత్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ వంటి ఆటగాళ్లు మూడు వన్డేల సిరీస్లో ఆడనున్నారు. వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో టీమిండియా ఆడే ప్రతి వన్డే సిరీస్ కీలకంగా మారింది. ఈ…
Team India: టీమిండియా ఆటగాళ్లు ఇటీవల కాలంలో తరచూ గాయాల పాలవుతున్నారు. దీంతో జట్టు ప్రణాళికలు దెబ్బతింటున్నాయి. ఆసియాకప్, టీ20 ప్రపంచకప్లలో టీమిండియా ఓటమికి ఒకరకంగా గాయాలు కూడా కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా టీమిండియాకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా మ్యాచ్ విన్నర్లు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్కు వీళ్లు జట్టులో ఉండి తీరాల్సిందే. అయితే గత 35 నెలల్లో వీళ్లు ఆడిన వన్డేలు ఎన్నో…
BCCI: రోడ్డుప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్కు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. ఈ సీజన్లో పంత్ ఆడకపోయినా పూర్తి జీతం అందించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో ఏ గ్రేడ్ ఆటగాడైన పంత్కు ఏడాదికి రూ.5 కోట్లు లభిస్తాయి. ఈ మొత్తాన్ని బీసీసీఐ అందజేయనుంది. దీంతో పాటు ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడిగా పంత్కు రావాల్సిన రూ.16 కోట్లను నిబంధనల ప్రకారం జట్టుతో ఒప్పందం చేసుకున్న…