Governor vs CM in Kerala: కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ గా తయారైంది అక్కడి పరిస్థితి. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకం వివాదం కేరళ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. తొమ్మిది యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు సోమవారం ఉదయం 11.30లోగా వైదొలగాలని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆదేశాలు జారీ చేయడంతో అక్కడ రాజకీయ దుమారం ఏర్పడింది. ఈ వివాదాస్పద…
ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలు, విలువలు లోపించాయని ఆవేదన వ్యక్తం చేశారు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి… రంగారెడ్డి జిల్లా మాడ్గులలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.. సీతారాం ఏచూరితో పాటు.. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, రాజ్య సభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎంపీ రాములు,…
Sitaram Yechury comments on BJP: ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) అధ్యక్షుడు, మాజీ హర్యానా ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా శుక్రవారం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిశారు. దివంగత చౌదరి దేవీలాల్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 25న ఫతేహాబాద్ లో జరిగే ర్యాలీకి హాజరుకావల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా వారిద్దరు దేశంలో విపక్షాల ఐక్యతపై మాట్లాడారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో విపక్షాలన్నీ ఏకం అవుతున్నాయని.. ఇది మంచి పరిణామం అని సీతారాం…
దేశవ్యాప్తంగా మతతత్వాలను రెచ్చగొట్టడం ద్వారా బీజేపీ దేశ సామాజిక సామరస్యాన్ని, సమగ్రతను నాశనం చేస్తోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. వరంగల్ పట్టణంలోని కాజీపేటలో ప్రారంభమైన మూడు రోజుల పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పై మండిపడ్డారు. రాజకీయ మైలేజ్ పొందడం కోసం కాషాయ పార్టీ మతతత్వానికి ఒడిగట్టిందని అన్నారు. తమ ‘మత విభజన భావజాలాన్ని’ పెంచుకునేందుకు బీజేపీ సమాజాన్ని పోలరైజ్ చేస్తోందని ఆరోపించారు. హిందూ-సైనికీకరణను విశ్వసించిన వీర్ సావర్కర్ అడుగుజాడల్లోనే…
హైద్రాబాద్లో జరుగుతున్న సీపీఐ జాతీయ సమావేశాల్లో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలో ఉంటే ఆర్ఎస్ఎస్ విధానాలనే అమలు చేస్తుందన్నారు. 2019లో అధికారంలోకి రాగానే రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందన్నారు. ప్రజా ఉద్యమాలతోనే కేంద్రం దిగి వస్తోందని ఏచూరి అన్నారు. Read Also: దేశంలో సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకున్న ఒమిక్రాన్ రైతాంగ పోరాటం మొదటి సారిమోడీని లొంగదీసిందన్నారు. పొరుగు దేశాలతో సంబంధాలు కూడా పూర్తిగా దిగజారాయని…
అన్ని రంగాల్లో ప్రధాని మోడీ విఫలమయ్యారని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. హైదరాబాద్లో సీపీఎం జాతీయ కమిటీ సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నేటితో ముగియనున్న సమావేశాలు. ఈ సమావేశాల్లో 23 రాజకీయ తీర్మానాలను ఆమోదించిన కేంద్ర కమిటీ. ఏప్రిల్ 6 నుంచి 10వ తేదీ వరకు కన్నూర్లో పార్టీ సమావేశాలు నిర్వహించనున్నట్టు కేంద్ర కార్యవర్గం నిర్ణయించింది. అనంతరం సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. బీజేపీ, ప్రధాని మోడీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.…
మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సీపీఎం రాష్ట్ర మహాసభలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ మహాసభలు గత సంవత్సరమే నిర్వహించాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో 4వ సంవత్సరంలో ఈ మహాసభలు నిర్వహిస్తున్నారు. అయితే నాలుగేళ్లలో పార్టీ చేసిన ఉద్యమాలు ఈ సభలో చర్చించనున్నారు. అంతేకాకుండా పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఈ మహాసభల్లో నిర్ణయం తీసుకోనున్నారు. వీటితో పాటు వివిధ రాజకీయ అంశాలపై సభలో తీర్మానాలు చేసే అవకాశం ఉంది.…