Sitaram Yechury: మోదీ చర్యలు ఫ్యూడల్ నిరంకుశత్వాన్ని సూచిస్తాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPM Sitaram Yechury Sensational Comments On PM Modi: సీపీఎం కార్యదర్శి సీతారాం ఏచూరి తాజాగా ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన ఆరోపణలు చేశారు. మోదీ చర్యలు ఫ్యూడల్ నిరంకుశత్వాన్ని సూచిస్తాయని కుండబద్దలు కొట్టారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ప్రెసిడెంట్ పార్లమెంట్లో ఓ భాగమని, కొత్త పార్లమెంటు బిల్డింగ్ అంశాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తేల్చి చెప్పారు. కొత్త పార్లమెంటును బహిష్కరించాలని 19 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించామని తెలిపారు. ఒక రాజదండం తీసుకొచ్చారని, అయితే దానికి ఎలాంటి ప్రామాణికత లేదని అసంతృప్తి వ్యక్తపరిచారు. పరిపాలన అధికారం ప్రజలు ఇచ్చారని.. నెహ్రూ ఆ రాజదండాన్ని మ్యూజియంలో పెట్టారని గుర్తు చేశారు. ప్రజలు ఎన్నుకున్న వారు ప్రజాస్వామ్యంలో పరిపాలిస్తారని చెప్పారు.
KA Paul: నేను, జగన్ కలిస్తే.. చంద్రబాబు కుప్పంలో ఓడిపోతాడు
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
పార్లమెంటు భవన ప్రారంభానికి వెళ్ళద్దని.. రాజ్యంగ ఉల్లంఘనను సమర్ధించవద్దని తాను వైసీపీ అధినేత జగన్కు చెప్పానని సీతారాం ఏచూర తెలిపారు. తుగ్లక్ పాలన లాగా రూ.2వేల నోటు మోడీ వెనక్కు తీసుకున్నాడని మండిపడ్డారు. అసలు డీమానిటైజ్ ఎందుకు చేసారో మోడీకి క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. ప్రజల డబ్బు అదానీ కంపెనీలలో పెట్టుబడిగా మారిందని ఆరోపించారు. కుంభకోణం గురించి మోడీ మాట్లడనని పార్లమెంటులో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రఫేల్, పెగసస్లాగా అదానీ విషయంలో కూడా ఏం జరగలేదని చూపించాలని బీజేపీ వాళ్లు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. జేబీసీ అనేది వెంటనే ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. త్వరలో రాజకీయ నిరసనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. రాష్ట్రాల్లో ఉన్న పరిస్ధితుల ఆధారంగా తమ నిర్ణయం ఉంటుందని, దేశంలో బీజేపీ వ్యతిరేక పార్టీలతో తాము కలుస్తామని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలన్నీ ఎన్నికల నేపధ్యంలో తీసుకున్నవేనని చెప్పుకొచ్చారు.
Nandamuri Balakrishna:సెట్ లో శ్రీలీల చెంప పగలకొట్టిన బాలయ్య..
అంతకుముందు కూడా.. మోదీని గద్దె దింపితేనే దేశానికి రక్షణ అని, అందుకోసం ప్రజా ఉద్యమాలు నిర్మిస్తూ లౌకిక శక్తులను ఏకం చేయాలని సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ఆ బాధ్యత ఉభయ కమ్యూనిస్టులపై ఉందన్నారు. బీజేపీ మతోన్మాద, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలన్నారు. మోదీ చెబుతున్న అభివృద్ధి మాటల్లో తప్ప చేతల్లో లేదని.. ప్రజల సొమ్ముతో చేస్తున్న కార్యక్రమాలు ఆర్భాటంగా ప్రారంభిస్తూ తాను తప్ప ఎవరూ చేయలేరని మోదీ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం కూని అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
-
SRH: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకులు.. టాప్ లోకి దూసుకెళ్లిన హైదరాబాద్.. పలు రికార్టులు బద్దలు..
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!