మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సీపీఎం రాష్ట్ర మహాసభలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ మహాసభలు గత సంవత్సరమే నిర్వహించాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో 4వ సంవత్సరంలో ఈ మహాసభలు నిర్వహిస్తున్నారు. అయితే నాలుగేళ్లలో పార్టీ చేసిన ఉద్యమాలు ఈ సభలో చర్చించనున్నారు.
అంతేకాకుండా పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఈ మహాసభల్లో నిర్ణయం తీసుకోనున్నారు. వీటితో పాటు వివిధ రాజకీయ అంశాలపై సభలో తీర్మానాలు చేసే అవకాశం ఉంది. ఈ మహాసభలకు పార్టీ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం హాజరుకానున్నారు. ఆయనతో పాటు పొలిట్బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారాట్, బీవీ రాఘవులు ఈ మహాసభల్లో పాల్గొననున్నారు.