Sangareddy: ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు ఓ ముఠా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో సంచలనంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న రామచంద్రపురం తహసీల్దార్ సంగ్రామ్ రెడ్డి విచారణ చేసి కొల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి ఆరు కోట్ల విలువైన స్థలం కబ్జా చేసారు. ఖాజాగూడ సర్వే నెంబర్ 27 గల ప్రభుత్వ స్థలానకి జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి సర్కిల్ లో అక్రమ మార్గాన ఇంటి నెంబర్ తీసుకుని, తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి NOC సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కబ్జారాయుళ్ళు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు కబ్జాదారుల పై పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో కబ్జారాయుళ్ళను అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు గచ్చిబౌలి పోలీసులు. ఖాజాగూడకు…