MGM : ఎంజీఎం ఆసుపత్రిలో మృతదేహం మారిన ఘటనలో సంచలన మలుపు చోటుచేసుకుంది. చనిపోయాడని భావించిన గోక కుమారస్వామి అనే వ్యక్తి, అసలు మృతుడే కాదని వరంగల్ పోలీసులు తాజాగా ధృవీకరించారు. ప్రస్తుతం ఆయన ఎంజీఎం ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఉన్నారని వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామానికి చెందిన గోక కుమారస్వామి అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరాడు. చికిత్సలో ఉన్నపుడే, ఆయన మరణించాడని భావించిన కుటుంబ సభ్యులు ఒక మృతదేహాన్ని తమ భర్తదని…