MGM : షాకింగ్.. మృతదేహం మారిన ఘటనలో ట్విస్ట్.. అతను చనిపోలేదట..!
- చనిపోయాడనుకున్న కుమారస్వామి ఆసుపత్రిలో బ్రతికే ఉన్నాడు
- గుర్తుతెలియని మృతదేహాన్ని దహనానికి తీసుకెళ్లిన కుటుంబం
- తప్పుగా తీసుకెళ్లిన శవం ఎవరిది? విచారణ చేస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MGM : ఎంజీఎం ఆసుపత్రిలో మృతదేహం మారిన ఘటనలో సంచలన మలుపు చోటుచేసుకుంది. చనిపోయాడని భావించిన గోక కుమారస్వామి అనే వ్యక్తి, అసలు మృతుడే కాదని వరంగల్ పోలీసులు తాజాగా ధృవీకరించారు. ప్రస్తుతం ఆయన ఎంజీఎం ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఉన్నారని వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామానికి చెందిన గోక కుమారస్వామి అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరాడు. చికిత్సలో ఉన్నపుడే, ఆయన మరణించాడని భావించిన కుటుంబ సభ్యులు ఒక మృతదేహాన్ని తమ భర్తదని గుర్తించి, దాన్ని ఇంటికి తీసుకెళ్లి దహనానికి సిద్ధమయ్యారు.
Radhika Yadav Murder: టెన్నిస్ ప్లేయర్ హత్య కేసు.. వెలుగులోకి మరిన్ని కీలక విషయాలు!
Also Read
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
- Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
- Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
అయితే ఊరి చివరికి శవాన్ని తీసుకెళ్తుండగా కుమారస్వామి కుమార్తె శవాన్ని పరిశీలించి.. “ఇది మా నాన్న కాదని” స్పష్టంగా చెప్పింది. వెంటనే వారు మృతదేహాన్ని తిరిగి మార్చురీకి తీసుకెళ్లారు. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు స్పందించారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేరే వ్యక్తిని పరిశీలించగా, అది గోక కుమారస్వామే అని స్పష్టమైంది. దీంతో, అసలు వ్యక్తి బ్రతికున్నాడన్న విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
ఈ క్రమంలో, నిన్న తప్పుగా తీసుకెళ్లిన మృతదేహం ఎవరిది? అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ గందరగోళం చోటుచేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఆసుపత్రి నిర్వహణపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతుంది. మృతదేహాల గుర్తింపు, అప్పగింపు ప్రక్రియలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
WOW : చాట్జీపీటీ మెడికల్ మిరాకిల్..! 10 ఏళ్లుగా పరిష్కారం లేని ఆరోగ్య సమస్యకు పరిష్కారం చూపిన ఏఐ..!
తాజావార్తలు
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
-
Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!