దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేసుల్లో పెరుగుదలను చూస్తుంటే థర్డ్వేవ్ అనివార్యమనిపిస్తోందని, ఇప్పటికే థర్డ్ వేవ్ వచ్చినట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబై తో పాటు అనేక పెద్ద నగరాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనక తప్పదని, అనివార్యం అని ఇప్పటికే నిపుణులు చెబుతున్నారని ముఖ్యమంత్రి ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనక తప్పదని అన్నారు.…