గత కొద్దిరోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు కారణంగా తీవ్ర నష్టాలు చవిచూసింది. గత వారం లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. దీంతో ఇన్వెస్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ట్రంప్ సన్నితుడు సెర్గియో గోర్ (38) భారతదేశంలో అమెరికా రాయబారిగా నియమితులయ్యారు. గత నవంబర్లో ఆయన నియమితులయ్యారు. తాజాగా ఆయన భారతదేశంలో రాయబారిగా బాధ్యతలు స్వీకరించారు.
Sergio Gor: భారతదేశంలో అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ శనివారం ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ఇద్దరు రక్షణ, వాణిజ్యం, సాంకేతికతో సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. వైట్ హౌజ్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కలిసి ఉన్న సంతకం చేసిన ఫోటోను ఆయన ప్రధానికి బహూకరించారు. మోడీకి బహూకరించిన ఫోటోలపై ట్రంప్ ‘‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మీరు గొప్పవారు’’ అని రాశారు.
భారత్-అమెరికా మధ్య టారిఫ్ ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్కు నూతన రాయబారిగా సెర్గియో గోర్ను నియమించారు. తన సన్నిహితుడు, రాజకీయ సహాయకుడు సెర్గియో గోర్(38)ను భారత రాయబారిగా నియమించినట్లు సోషల్ మీడియాలో ట్రంప్ పేర్కొన్నారు.