SP Leader Azam Khan: ఎస్పీ నేత ఆజంఖాన్కు రెండేళ్ల జైలు .. విద్వేషపూరిత ప్రసంగాల కేసులో శిక్ష ఖరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SP Leader Azam Khan: విద్వేషపూరిత ప్రసంగాల కేసులో సమాజ్ వాదీ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆజంఖాన్ను కోర్టు దోషిగా తేల్చింది. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై చేసిన వ్యాఖ్యలకు గాను రాంపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 2019 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నమోదైన విద్వేషపూరిత ప్రసంగాల కేసులో యూపీకి చెందిన సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ కు రాంపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం ఆజం బెయిల్ పై బయట ఉన్నారు. గత ఆరు నెలల్లో అజాంఖాన్ దోషిగా తేలిన మూడో కేసు ఇది. అయితే మూడు కేసుల్లో ఒకదానిలో కింది కోర్టు తీర్పుపై ఆయన అప్పీల్ కు అనుమతి లభించడంతో ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు.
Read also: Tamilnadu: మీ కోరికలు వెంటనే తీరాలంటే ఈ గుడికి ఒక్కసారి వెళ్ళాల్సిందే..!
Also Read
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
విద్వేషపూరిత ప్రసంగాల కేసులో ఆజంఖాన్ ను కోర్టు దోషిగా తేల్చింది. ఆ తర్వాత కోర్టు ఆయనకు (ఆజంఖాన్) రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించింది. 2019 ఏప్రిల్ 8న రాంపూర్ లోని షాజద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదు అయ్యింది. మిలాక్ విధానసభ ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి (యోగి ఆదిత్యనాథ్), రిటర్నింగ్ అధికారిగా ఉన్న అప్పటి రాంపూర్ జిల్లా మేజిస్ట్రేట్ లను లక్ష్యంగా చేసుకుని ఆజం రెచ్చగొట్టే ప్రసంగం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read also: Tamilnadu: మీ కోరికలు వెంటనే తీరాలంటే ఈ గుడికి ఒక్కసారి వెళ్ళాల్సిందే..!
2019 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలు కూటమిగా పోటీ చేసినప్పుడు ఈ ప్రసంగం చేశారు. ఆయన రాంపూర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి, సినీ నటి జయప్రదపై విజయం సాధించారు. తరువాత రాష్ట్ర ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఖాన్ తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. గత ఏడాది మరో విద్వేషపూరిత ప్రసంగం కేసులో దోషిగా తేలడంతో ఆజంను రాష్ట్ర అసెంబ్లీ నుంచి అనర్హుడిగా ప్రకటించారు. రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అజాంకు వై కేటగిరీ భద్రత అవసరం లేదంటూ ఉపసంహరించుకుంది. అయితే ఆయనకు వస్తున్న బెదింపుల నేపథ్యంలో రాంపూర్ పోలీసులు శుక్రవారం పలువురు పోలీసు సిబ్బందిని ఆయన భద్రత కోసం కేటాయించారు. 2017లో ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాంపూర్ లో ఆజంఖాన్ పై భూకబ్జా, మోసం, క్రిమినల్ అతిక్రమణ సహా వివిధ అభియోగాలపై 81 కేసులు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!