Gujarat: ప్రధాని సొంత రాష్ట్రంలో ఉగ్రవాదులు కలకలం సృష్టించారు. గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం (ATS) ఓ పెద్ద విజయాన్ని సాధించింది. చాలా కాలంగా అంతుచిక్కని ISIS-సంబంధిత ఉగ్రవాదులను ఉమ్మడి ఆపరేషన్లో అరెస్టు చేశారు. ఇందులో ఒకడపై ఏడాది పాటు భద్రతా సంస్థల నిఘా పెట్టినట్లు చెబుతున్నారు. ఉగ్రవాద దాడికి కుట్ర పన్నుతున్నట్లు కనుగొన్నారు. ఈ ముగ్గురు ఉగ్రవాదులు ISISతో ముడిపడి ఉన్న రెండు వేర్వేరు మాడ్యూళ్లలో భాగమని చెబుతున్నారు. ఏటీఎస్(Anti-Terrorism Squad) ఈ ఉగ్రవాదులను ఏడాది…
Vasi Zakariya: పాకిస్థాన్ దేశంలోని ఖలీఫా సంస్థ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న వరంగల్ వాసి జకర్యను పోలీసులు మద్రాసు ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. 25 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ నుండి భారత్కు వచ్చిన జకర్య తొలుత ఎనిమిది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో జీవనం కొనసాగించాడు. అనంతరం తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలోని జాన్పీరీలు ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్నాడు. వరంగల్ జిల్లాలో స్థిరపడిన జకర్య, అండర్ బ్రిడ్జి ప్రాంతంలో ఒక బిర్యానీ సెంటర్ను నిర్వహిస్తూ జీవనం…
PUBG Love Story: పబ్జీ గేమింగ్ సమయంలో ఒక పాకిస్థానీ మహిళ భారతీయ వ్యక్తితో ప్రేమలో పడింది. ఈ ప్రేమ ఎంతగా బలపడిందంటే ఈ పాకిస్థానీ యువతి తన నలుగురు పిల్లలతో సరిహద్దులు దాటి భారతీయుడి కోసం వచ్చేసింది.
పూంచ్ ఉగ్రదాడి ఘటన రాజకీయ రంగు పులుముకుంటోంది. జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సి) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. పూంచ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నిందితులపై ఆపరేషన్ సమయంలో అమాయకులను వేధించవద్దని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సి) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా భద్రతా ఏజెన్సీలను కోరారు.
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే.. భారీ ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి… ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని.. తమకు సమాచారం చేరినట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి.. డ్రోన్లతో దాడికి ఉగ్రవాదుల కుట్రపన్నారని వెల్లడించిన ఇంటెలీజెన్స్ బ్యూరో… దేశ రాజధానిలో ‘ఆపరేషన్ జెహాద్’ ను ప్రారంభించడానికి ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారు. ఆగస్టు 15కు ముందే దాడులకు ప్రణాళికలు వేసినట్టు చెబుతున్నారు.. ఈ ఉగ్రదాడిని అడ్డుకోవడానికి అలర్ట్గా…