PUBG Love Story: పబ్జీ ఆడుతూ ప్రేమలో పడింది.. నలుగురు పిల్లలతో పాక్ నుంచి భారత్ వచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PUBG Love Story: పబ్జీ గేమింగ్ సమయంలో ఒక పాకిస్థానీ మహిళ భారతీయ వ్యక్తితో ప్రేమలో పడింది. ఈ ప్రేమ ఎంతగా బలపడిందంటే ఈ పాకిస్థానీ యువతి తన నలుగురు పిల్లలతో సరిహద్దులు దాటి భారతీయుడి కోసం వచ్చేసింది. ఆ మహిళ తన ప్రేమికుడిని కలవడానికి మొదట నేపాల్ సరిహద్దుకు వెళ్లే మార్గంలో తన నలుగురు పిల్లలతో సహా ఎన్సిఆర్లోని గ్రేటర్ నోయిడాకు చేరుకుంది. అప్పటి నుండి అందరూ పరారీలో ఉన్నారు. ఈ సంఘటన భద్రతా ఏజెన్సీలను కూడా ఆశ్చర్యపరిచింది. అందరి కోసం అన్వేషణ కొనసాగుతోంది. వాస్తవానికి.. ఈ మహిళ తన భారతీయ ప్రేమికుడిని కలవడానికి గ్రేటర్ నోయిడాలోని రబూపురాకు వచ్చింది. ఆ విషయం గురించి వార్తలు బహిర్గతం అయిన వెంటనే పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి. మహిళ ఇప్పుడు మధుర చుట్టూపక్కల నివసిస్తున్నట్లు సమాచారం. అతి త్వరలో ఆమెను అరెస్టు చేయవచ్చు.
Read Also:Payal Rajput: ఆ హీరోతో ఒక్కసారైనా ఆ పని చెయ్యాలి?
Also Read
- SA20 2027 షెడ్యూల్ విడుదల.. జనవరి 17 నుంచి షురూ.!
- Coffee Is Good for Your Heart?: కాఫీతో గుండె ఆరోగ్యం మెరుగవుతుందా..? తాజా అధ్యయనం ఏమి చెబుతోంది?
- Sonam Wangchuk: విద్యార్థులపై కేసులుండవు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం.. కేంద్రం ఇచ్చిన హామీలు ఇవే!
- India vs Afghanistan: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. భారత్ గడ్డపై టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనున్న ఆఫ్ఘనిస్థాన్.. పూర్తి షెడ్యూల్..
గ్రేటర్ నోయిడాలోని రబుపురాకు చెందిన సచిన్ ఆన్లైన్ గేమ్ PUBG ఆడుతున్నప్పుడు పాకిస్తాన్కు చెందిన సీమా అనే వివాహితతో స్నేహం చేశాడు. ఆపై ఇద్దరూ ప్రేమలో పడ్డారు. దీని తరువాత మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా భారతదేశానికి వచ్చింది. మే 13న సచిన్తో జీవితం గడుపుతానని వాగ్దానం చేస్తూ రబూపురకు రావడానికి యమునా ఎక్స్ప్రెస్వే వద్దకు చేరుకుంది. ఆ యువకుడు సచిన్ రబుపురాలోని ధాన్యం మార్కెట్లో పుల్లర్గా పనిచేసేవాడు. సచిన్ తన పాకిస్థాన్ ప్రియురాలు రాకముందే పట్టణంలోని అంబేద్కర్ ప్రాంతంలో ఆమె కోసం ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. రెండు రోజుల తర్వాత భార్యతో కలిసి ఇంటికి వస్తానని చెప్పాడు. భూస్వామి గిరిజేష్ జాతవ్కి సచిన్తో పరిచయం ఉంది. అందుకే సచిన్ని నమ్మి అతడికి ఇంటిని అద్దెకు ఇచ్చాడు. సచిన్ కుటుంబ సభ్యులు కూడా సచిన్ను కలిసేందుకు వచ్చేవారని చుట్టుపక్కల వారు తెలిపారు. దీంతో ఆ మహిళ సచిన్ భార్య అని, పిల్లలు కూడా ఉన్నారని అందరినీ నమ్మించారు. ఈ మొత్తం విషయం బయటపడడంతో పోలీసులు యాక్టివ్ అయ్యారు. తాను పాకిస్థాన్లోని కరాచీ నివాసి అని ఆ మహిళ చెప్పింది. ఇద్దరి కోసం పోలీసులు వెతుకుతున్నారు. మహిళ లొకేషన్ మథుర సమీపంలో చూపిస్తోంది. దీని కారణంగా పోలీసులు ఇక్కడ ఉన్న అన్ని హోటళ్లను పరిశీలిస్తున్నారు. మరోవైపు సచిన్ బంధువులు మాత్రం ఇద్దరి గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.
Read Also:Tadipatri: ఆత్మహత్య చేసుకున్న తాడిపత్రి టౌన్ సిఐ.. కారణం అదేనా?
తాజావార్తలు
-
SA20 2027 షెడ్యూల్ విడుదల.. జనవరి 17 నుంచి షురూ.!
-
Mayank Yadav: రెండేళ్లు నరకం అనుభవించా.. ఒంటరిగా కూర్చొని ఏడ్చేశా.. టీమిండియా మ్యాచ్ విన్నర్ భావోద్వేగం!
-
Coffee Is Good for Your Heart?: కాఫీతో గుండె ఆరోగ్యం మెరుగవుతుందా..? తాజా అధ్యయనం ఏమి చెబుతోంది?
-
Infosys Hiring 2026: గ్రాడ్యుయేట్స్ కు ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ చెప్పిన ఇన్ఫోసిస్..
-
Ramayana Trailer: చివరి నిమిషంలో ‘రామాయణ’ ట్రైలర్ వాయిదా.. అసలు కారణం ఏంటంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?