PUBG Love Story: పబ్జీ ఆడుతూ ప్రేమలో పడింది.. నలుగురు పిల్లలతో పాక్ నుంచి భారత్ వచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PUBG Love Story: పబ్జీ గేమింగ్ సమయంలో ఒక పాకిస్థానీ మహిళ భారతీయ వ్యక్తితో ప్రేమలో పడింది. ఈ ప్రేమ ఎంతగా బలపడిందంటే ఈ పాకిస్థానీ యువతి తన నలుగురు పిల్లలతో సరిహద్దులు దాటి భారతీయుడి కోసం వచ్చేసింది. ఆ మహిళ తన ప్రేమికుడిని కలవడానికి మొదట నేపాల్ సరిహద్దుకు వెళ్లే మార్గంలో తన నలుగురు పిల్లలతో సహా ఎన్సిఆర్లోని గ్రేటర్ నోయిడాకు చేరుకుంది. అప్పటి నుండి అందరూ పరారీలో ఉన్నారు. ఈ సంఘటన భద్రతా ఏజెన్సీలను కూడా ఆశ్చర్యపరిచింది. అందరి కోసం అన్వేషణ కొనసాగుతోంది. వాస్తవానికి.. ఈ మహిళ తన భారతీయ ప్రేమికుడిని కలవడానికి గ్రేటర్ నోయిడాలోని రబూపురాకు వచ్చింది. ఆ విషయం గురించి వార్తలు బహిర్గతం అయిన వెంటనే పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి. మహిళ ఇప్పుడు మధుర చుట్టూపక్కల నివసిస్తున్నట్లు సమాచారం. అతి త్వరలో ఆమెను అరెస్టు చేయవచ్చు.
Read Also:Payal Rajput: ఆ హీరోతో ఒక్కసారైనా ఆ పని చెయ్యాలి?
Also Read
- Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
- Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
- Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి 'రోమాన్స్ స్కామ్' కథ వింటే నోరెళ్లబెడతారు!
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
గ్రేటర్ నోయిడాలోని రబుపురాకు చెందిన సచిన్ ఆన్లైన్ గేమ్ PUBG ఆడుతున్నప్పుడు పాకిస్తాన్కు చెందిన సీమా అనే వివాహితతో స్నేహం చేశాడు. ఆపై ఇద్దరూ ప్రేమలో పడ్డారు. దీని తరువాత మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా భారతదేశానికి వచ్చింది. మే 13న సచిన్తో జీవితం గడుపుతానని వాగ్దానం చేస్తూ రబూపురకు రావడానికి యమునా ఎక్స్ప్రెస్వే వద్దకు చేరుకుంది. ఆ యువకుడు సచిన్ రబుపురాలోని ధాన్యం మార్కెట్లో పుల్లర్గా పనిచేసేవాడు. సచిన్ తన పాకిస్థాన్ ప్రియురాలు రాకముందే పట్టణంలోని అంబేద్కర్ ప్రాంతంలో ఆమె కోసం ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. రెండు రోజుల తర్వాత భార్యతో కలిసి ఇంటికి వస్తానని చెప్పాడు. భూస్వామి గిరిజేష్ జాతవ్కి సచిన్తో పరిచయం ఉంది. అందుకే సచిన్ని నమ్మి అతడికి ఇంటిని అద్దెకు ఇచ్చాడు. సచిన్ కుటుంబ సభ్యులు కూడా సచిన్ను కలిసేందుకు వచ్చేవారని చుట్టుపక్కల వారు తెలిపారు. దీంతో ఆ మహిళ సచిన్ భార్య అని, పిల్లలు కూడా ఉన్నారని అందరినీ నమ్మించారు. ఈ మొత్తం విషయం బయటపడడంతో పోలీసులు యాక్టివ్ అయ్యారు. తాను పాకిస్థాన్లోని కరాచీ నివాసి అని ఆ మహిళ చెప్పింది. ఇద్దరి కోసం పోలీసులు వెతుకుతున్నారు. మహిళ లొకేషన్ మథుర సమీపంలో చూపిస్తోంది. దీని కారణంగా పోలీసులు ఇక్కడ ఉన్న అన్ని హోటళ్లను పరిశీలిస్తున్నారు. మరోవైపు సచిన్ బంధువులు మాత్రం ఇద్దరి గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.
Read Also:Tadipatri: ఆత్మహత్య చేసుకున్న తాడిపత్రి టౌన్ సిఐ.. కారణం అదేనా?
తాజావార్తలు
-
Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే షాకిచ్చిన బులియన్ మార్కెట్!
-
Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి ‘రోమాన్స్ స్కామ్’ కథ వింటే నోరెళ్లబెడతారు!
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
ట్రెండింగ్
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..