Sammakka Sarakka: సమ్మక్క, సారలమ్మ దర్శనం నిలిపివేత..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sammakka Sarakka: ఈ నెల 29, 30 తేదీల్లో మేడారంలో అమ్మవార్ల దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు సమ్మక్క, సారలమ్మ పూజారులు తెలిపారు. ఆదివారం అమ్మవార్ల గద్దెల ఆవరణలో అర్చకులు, భాగస్వామ్య వర్గాల సమావేశం నిర్వహించారు. వరంగల్లోని మేడారం సమ్మక్క, సారలమ్మ కార్యాలయాలను ఖాళీ చేయించి తమ ఆధీనంలోకి తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నారని భద్రకాళి దేవస్థానం అర్చకులు ఆరోపించారు. 1972లో అప్పటి మంత్రి పోరిక జగన్నాయక్ వరంగల్లో మేడారం జాతర కార్యాలయానికి స్థలం కేటాయించగా భద్రకాళి, మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయాల నుంచి నిధులు సేకరించి 2కోట్లతో నగరం నడిబొడ్డున కార్యాలయాన్ని నిర్మించారు. ఈ భవనంలోనే మతతత్వ శాఖ కార్యాలయాలన్నీ కొనసాగుతున్నా.. అమ్మవార్లకు కేటాయించిన స్థలంలో కార్యాలయాన్ని కొనసాగించాలని కోరారు. ఈ క్రమంలో రెండు రోజుల పాటు దర్శనం నిలిపివేస్తామని, అధికారులు స్పందించకుంటే జూన్ మొదటి వారంలో వరంగల్లో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
Read also: Top Movies In 2024: ఈ ఏడాది 100 కోట్లు రాబట్టిన సినిమాలు ఇవే..
Also Read
- Telangana 22A Land Issues: 22ఏ భూ సమస్యల పరిష్కారానికి హైలెవల్ కమిటీ.. రేపటి నుంచే దరఖాస్తులు
- KTR: "రూ.1000 కోట్లు ఇస్తే మా ఆస్తులన్నీ ఇచ్చేస్తా".. సీఎం రేవంత్రెడ్డికి కేటీఆర్ ఆఫర్.. ..
- Ponguleti Srinivasa Reddy: అసైన్డ్ భూములు లాక్కోం.. పట్టాదారులకు ఇబ్బంది ఉండదని మంత్రి స్పష్టం
- Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 21, 2024న ప్రారంభమై 24న ముగిసింది. మొత్తం నాలుగు రోజుల పాటు జాతరను తిలకించిన లక్షలాది మంది భక్తులు మధురస్మృతితో నింపుకుని స్వగ్రామాలకు వెళ్తున్నారు. మళ్లీ రెండేళ్లలో వస్తాం అంటూ మేడారాన్ని భారంగా బయలుదేరారు. కాగా. కోరిన కోరికలను తీర్చే ఇష్టదైవాలను తలుచుకుంటూ ఇంటి బాట పడుతున్నారు. ఈసారి కోటి 35 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక.. మేడారం జాతర విజయవంతంగా నిర్వహించారు. జాతర విజయవంతానికి కృషి చేసిన ప్రజలు, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మంత్రి సీతక్క. అయితే.. జాతరలో వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు మంజూరు చేసారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా తమ వంతు కృషి చేశామని పేర్కొన్నారు. ఇక.. 20 శాఖల అధికారులు జాతర పనుల్లో పూర్తిగా నిమగ్నమయ్యారని సీతక్క తెలిపారు. అంతే కాకుండా.. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ వారు నిరంతరం పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.
East Godavari: నన్నయ్య యూనివర్సిటీలో భద్రపరిచిన ఈవీఎంలు.. 144 సెక్షన్ అమలు..
తాజావార్తలు
-
Gautam Gambhir: హార్దిక్ వస్తే నితీశ్ రెడ్డి పరిస్థితి ఏంటి?.. గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు!
-
Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. రూ.300 కోట్ల క్లబ్కు అడుగు దూరంలో!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
ట్రెండింగ్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!