మంగళగిరి పోలీస్స్టేషన్ వద్దకు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేరుకున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జల రామకృష్ణా రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో సజ్జలను పోలీసులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. మంగళగిరి పోలీస్స్టేషన్ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
మాటల కంటే చేతలు ముఖ్యమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. జగన్ అంటేనే విద్యాలయాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. నాడు నేడు పథకంలో కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా మంచి విద్య అందేలా స్కూళ్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని ఆయన అన్నారు.
ఏపీలో పీఆర్సీపీ ఉత్కంఠ నెలకొంది. ఉద్యోగ సంఘాల నేతలతో పలుమార్లు ప్రభుత్వం పీఆర్సీపై చర్చలు జరిగిపింది. ఇప్పటికే అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికలో ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన అంశాలు లేవని ఉద్యోగ సంఘాలు గళమెత్తాయి. అయితే నిన్న కూడా సీఎం జగన్ ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించారు. అయితే నేడు సీఎం జగన్ మరోసారి ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పీఆర్సీపై సీఎం సానుకూల ప్రకటన చేస్తారని భావిస్తున్నామన్నారు.…
ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.. ఇక, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇవాళ ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికలు జరగనున్న మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.. ఆంధ్రప్రదేశ్లోని 14 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.. ఎమ్మెల్యే కోటా కింద మూడు ఎమ్మెల్సీ స్థానాలకు, స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.. అయితే, స్థానిక సంస్థలకు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను రెండు రోజుల్లో ప్రకటిస్తామని…
ఆంధ్రప్రదేశ్లోని 14 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.. ఎమ్మెల్యే కోటా కింద మూడు ఎమ్మెల్సీ స్థానాలకు, స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే షెడ్యూల్ కూడా జారీ చేశారు.. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది.. స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 16న నోటిఫికేషన్ జారీచేసి అదేరోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇక, ఈ ఎన్నికలకు సిద్ధమైపోతోంది అధికార…
మా ప్రభుత్వంలో ఎవరైనా సరే దాష్టీకం చేస్తే సహించేది లేదని, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రకటనలో ఏదైనా అవాస్తవం ఉందా అనేది రాష్ట్ర బీజేపీ చెప్పాలన్నారు. రూ. 3.20లక్షల కోట్లు కేంద్రం కోటా కింద వేసుకుంటుందని, దాన్ని కూడా రాష్ట్రాలకు వాటా ప్రకారం ఇవ్వాలన్నారు. అప్పుడు కేంద్రం ఎంత తగ్గిస్తే దాని ప్రకారం రాష్ట్రాల్లో తగ్గుతుందన్నారు. మీరు నామమాత్రం తగ్గించి రాష్ట్రాలు తగ్గించాలి…