ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.. ఇక, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇవాళ ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికలు జరగనున్న మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.. ఆంధ్రప్రదేశ్లోని 14 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.. ఎమ్మెల్యే కోటా కింద మూడు ఎమ్మెల్సీ స్థానాలకు, స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.. అయితే, స్థానిక సంస్థలకు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను రెండు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి..
Read Also: ఎమ్మెల్సీ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు సజ్జల.. కడప జిల్లా- గోవింద రెడ్డిని కొనసాగించనున్నట్టు వెల్లడించిన ఆయన. శ్రీకాకుళం జిల్లా – పాలవలస విక్రాంత్ (కాపు), కర్నూలు-ఇషాక్ (మైనారిటీ) నంద్యాల మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ను అభ్యర్థులుగా ప్రకటించారు.. ఇక, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థుల జాబితా రెండు రోజుల్లో ప్రకటిస్తామని వెల్లడించారు.. మొత్తం 14 స్థానాలకు 50 శాతం మేర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అభ్యర్థులు ఉంటారన్న ఆయన.. ఇప్పటికే మాకు కౌన్సిల్ లో 18 మందిలో11 మంది బీసీ, ఎస్సీ, మైనారిటీ సభ్యులే ఉన్నారని గుర్తుచేశారు.