రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం రష్యా వెళ్లారు. ఈరోజు మాస్కోలో ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్తో భేటీ కానున్న ప్రధాని, ఆయనతో పలు అంశాలపై చర్చించనున్నారు. దాదాపు ఐదేళ్లలో ప్రధాని మోదీ రష్యాకు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక విందు ఇవ్వనున్నారు.
PM Modi Russia Tour: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. 22వ ఇండో– రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనబోతున్నారు.
PM Modi : భారతదేశం, ఆస్ట్రియా మధ్య దౌత్య సంబంధాలు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యూరోపియన్ దేశాన్ని సందర్శించడం గొప్ప గౌరవమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
PM Modi Russia Visit:ప్రధాని నరేంద్రమోడీ దాదాపుగా 5 ఏళ్ల తర్వాత మిత్రదేశం రష్యా పర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటనను రష్యా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.
భారత్-రష్యా జాయింట్ వెంచర్ అయిన ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఆర్ఆర్పీఎల్) 35 వేల ఏకే-203 కలాష్నికోవ్ అసాల్ట్ రైఫిళ్లను భారత సైన్యానికి అందజేసింది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర భారత్ కింద తయారైన ఈ రైఫిల్స్ సైన్యాన్ని బలోపేతం చేస్తాయి. భారతదేశం సమీకరించిన కలాష్నికోవ్ ఏకే-203 అసాల్ట్ రైఫిల్స్ను ఉత్తరప్రదేశ్లోని అమేథీ జిల్లాలో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలో తయారు చేశారు.
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో బుధవారం ఆస్తానాలో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతంలో చిక్కుకున్న తమ పౌరులపై భారత్ ఆందోళనలను లేవనెత్తారు. వారు సురక్షితంగా తిరిగి రావాలని ఒత్తిడి చేశారు . యుద్ధం నేపథ్యంలో భారతీయుల సమస్యపై లావ్రోవ్తో లేవనెత్తారా అనే ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు.
నెలల తరబడి ఉక్రెయిన్ పై విరుచుకుపడిన రష్యా దళాలు చివరకు ఉక్రెయిన్లోని డొనెట్స్క్ ప్రావిన్స్లోని చాసివ్ యార్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాయి. వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఈ నగరం నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.
ప్రధాని నరేంద్ర మోడీ జులై 8 నుంచి 10 వరకు రష్యా, ఆస్ట్రియాల్లో అధికారిక పర్యటనకు వెళ్లనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం వెల్లడించింది. 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడానికి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోడీ జులై 8 , జులై 9 తేదీల్లో మాస్కోలో పర్యటించనున్నారు
Pakistan: కజకిస్తాన్ వేదికగా ఎస్సీఓ సమ్మిట్ జరుగుతోంది. ఈ సమ్మిట్లో రష్యా అధ్యక్షుడు పుతిన్తో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పుతిన్ పాకిస్తాన్కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే, ఈ ఆఫర్లను పాక్ ఉపయోగించుకుంటుందా..? లేదా..? అనేది ప్రశ్న.
విషాదకరమైన ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఉత్తర్ప్రదేశ్లో జరిగిన ఘోర ప్రమాదంపై అత్యంత హృదయపూర్వక సంతాపాన్ని అంగీకరించడం’’