Accident : సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్లోని దుర్గాపురం వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు, ఆ ప్రాంతంలో నిలిచివున్న లారీని వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. మృతులను ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా ఆలమూరుకు చెందిన ఎస్ఐ అశోక్ , కానిస్టేబుల్ స్వామిగా గుర్తించారు. ప్రమాద సమయంలో వారు కారు ప్రయాణిస్తున్నారు. Coolie…
Mancherial: మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామం సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఓ దురదృష్టకర ఘటన జరిగింది. జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒక లారీ పూర్తిగా నుజ్జునుజ్జయి అయిపోగా, మరో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. Read Also:HONOR X9C 5G: డిజైన్లో క్లాస్, పెర్ఫార్మెన్స్లో దమ్మున్న ఫోన్ను లాంచ్ చేసేందుకు సిద్ధమైన హానర్..! ఈ ఘటనకు గురైన లారీలలో ఒకటి ప్రఖ్యాత సబ్బు బ్రాండ్ అయిన…
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తూర్పుపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దాంతో కారులో ఒక్కసారి మంటలు వ్యాపించాయి. స్థానికులు గుర్తించి కారులో ఉన్న నలుగురిని వెంటనే బయటకు తీశారు. నలుగురిలో ఇద్దరు మరణించారు. Also Read: Pawan Kalyan: మధురై చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్.. పంచెకట్టులో..! కారు ప్రమాదంలో భార్యాభర్తలు మరణించారు. కొడుకు, కుమార్తెకు తీవ్ర గాయాలు అయ్యాయి. తిరుపతి…
ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బైకులు, కార్లు, ఇతర వాహనాలను జాగ్రత్తగా చూసుకుంటుంటారు. అవి పాడైపోయాక కూడా ఇంట్లోనే భద్రంగా భద్రపరుచుకుంటుంటారు. వాటిని కుటుంబ సభ్యులుగా భావిస్తుంటారు. ఈ క్రమంలో గుజరాత్లోని ఖేడా జిల్లాలోని నదియాద్లోని ఉత్తర్సంద గ్రామంలో ఒక భావోద్వేగ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో బైక్ ప్రియుడైన యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణించగా అతని కుటుంబం అతని బైక్తో అంతిమ వీడ్కోలు పలికింది. అంత్యక్రియలు నిర్వహిస్తున్నప్పుడు, కుటుంబం అతనికి ఇష్టమైన బైక్తో పాతిపెట్టాలని నిర్ణయించుకుంది. అతను…
కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం కొమరగిరిలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే నవ దంపతులు యాక్సిడెంట్లో మృతి చెందారు. ఆదివారం సాయంత్రం ఆర్కే బీచ్కి వెళ్తుండగా బైక్ను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఇద్దరి మృతితో బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also Read: Tomato-Uji: ఊజీ ఈగ దెబ్బ.. టమోటాను పడేస్తున్న రైతులు!…
కర్నాటకలో హోసకోట్ సమీపంలోని గొట్టిపుర గేట్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో చిత్తూరు జిల్లాకు చెందిన నలుగురు మృతిచెందారు.. తిరుపతి నుండి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసి బస్సు ఓవర్ టెక్ చేస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.. దీంతో, బస్సులో ఉన్న కేశవరెడ్డి (44), తులసి (21), ప్రణతి (4) మరియు (1) సంవత్సరం చిన్నారి కూడా ప్రాణాలు విడిచింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. రాజమండ్రి – కాకినాడ ఏడీబీ రోడ్డుపై వడిశలేరు దగ్గర చోటు చేసుకున్న ప్రమాదంలో ఐదుగురు చనిపోయారని తెలిసి చింతిస్తున్నాను.. ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమైంది.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అన్నారు.
Nigeria: నైజీరియాలో తాజాగా ఓ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఓగున్ రాష్ట్రంలోని జాతీయ క్రీడలను ముగించుకుని తిరిగివస్తుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో 21 మంది క్రీడాకారులు, అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నైజీరియా క్రీడా ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. ఈ దుర్ఘటన శనివారం చోటు చేసుకుంది. ప్రమాదం కానోకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దకాసోయే పట్టణం వద్ద జరిగింది. ఓగున్ రాష్ట్ర రాజధాని అబేఒకుటా నుంచి ప్రయాణిస్తున్న కోస్టల్ బస్సు రాత్రంతా ప్రయాణించి…
మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. షాద్ నగర్ లో మక్తల్ ఎమ్మెల్యే వాహనానికి ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వైపు వెళ్తున్న TG 38 6669 నెంబర్ గల ఇన్నోవా కారును పక్కన నుంచి వస్తున్న ఐ 20 కారు వేగంగా ఢీకొట్టింది. షాద్ నగర్ రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఎమ్మెల్యే కారు స్వల్పంగా ధ్వంసం అయ్యింది. ఈ…
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం రాజమండ్రి ఆటోనగర్ సమీపంలోని కొంతమూరు వద్ద జాతీయ రహదారిపై లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. Also Read: Gold Rate Today: మగువలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు! ప్రమాద సమయంలో కారులో…