మార్కెట్ లో నకిలీ నోట్ల బెడద ప్రజలను కలవరపెడుతున్నది. ఈజీ మనీ కోసం కొందరు కేటుగాళ్లు దొంగ నోట్లను ముద్రణకు తెరలేపుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలని, కోటీశ్వరులం అయిపోవాలని నకిలీ నోట్లను తయారు చేస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో దొంగ నోట్ల తయారీ కలకలం రేపిన విషయం తెలిసిందే. రూ.500 ఫేక్ కరెన్సీ ముద్రిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపించారు. ఇప్పుడు రూ.…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూ రూల్స్ తీసుకొచ్చింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఖాతాదారుల ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించకుంటే జరిమానా విధించనున్నట్లు తెలిపింది. ఈ జరిమానాను ఖాతాదారులకు పరిహారంగా అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ ఆదేశాలతో ఖాతాదారులకు బ్యాంకులు ఇకపై రోజుకు రూ. 100 చెల్లించనున్నాయి. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం బ్యాంకులు కస్టమర్ ఫిర్యాదులను ఒక నెలలోపు పరిష్కరించాలి. ఆ లోపు సమస్య పరిష్కారం కాకపోతే రోజుకు రూ.100 జరిమానా…
Gold : బంగారంలో పెట్టుబడి పెట్టడం ఎల్లప్పుడూ సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. ఇది భారతదేశంలో సాధారణ విషయం. భారతదేశంలోని చాలా మంది మహిళలు బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.
Bank Holidays In January: మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. కొత్త సంవత్సరాన్ని స్వాగతించేందు దేశవ్యాప్తంగా అందరూ సిద్ధమయ్యారు. అయితే, 2025 జనవరిలో బ్యాంకులకు భారీగా సెలవులు ఉండటంతో ముందుగా మన లావాదేవీలను నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. జనవరిలో దాదాపుగా బ్యాంకులకు 15 రోజుల పాటు సెలువులు ఉంటున్నాయి. వీటిలో రెండో, నాలుగో శనివారాలతో పాటు ఆదివారాలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో జనవరి 1 తేదీతో బ్యాంక్ సెలవులు ప్రారంభమవుతున్నాయి.
RBI Receives Bomb Threat: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. ఆర్బీఐ గవర్నర్ కు ఈ మెయిల్ ద్వారా పంపిన బెదిరింపుల్లో బ్యాంకును పేల్చివేస్తామంటూ రష్యన్ భాషలో గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని పంపించారు.
సంక్రాంతి నుంచి రైతు భరోసా.. ఇప్పటికే ప్రకటించామన్న భట్టి రైతు భరోసాని సంక్రాంతి నుంచి అమలుచేస్తామని.. ఇప్పటికే ప్రకటించామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రైతులకు ఇచ్చే బోనస్ రైతు భరోసా, రుణమాఫీ కన్నా ఎక్కువ లబ్ధి రైతులకు చేకూర్చుతుందని తెలిపారు. ఢిల్లీలో మీడియాతో డిప్యూటీ సీఎం చిట్ చిట్ నిర్వహించారు. రాహుల్ గాంధీని కలవలేదని తెలిపారు. మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. హైడ్రాకి ధనికా పేద అన్న తేడా లేదని భట్టి…
Shaktikanta Das: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ రోజు ( డిసెంబర్ 10) తన పదవి విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ చేశారు.. అందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. ఈ సారి కూడా రేపో రేటులో ఎలాంటి మార్పులు తీసుకురాలేదని ఆయన వెల్లడించారు. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించనున్నారు. ఎంపీసీ గత 10 సమావేశాల్లో కూడా రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. 11వ సమావేశంలో కూడా 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. రెపో రేటు అంటే ఆర్బీఐ బ్యాంకులకు రుణాలు…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ రెండో త్రైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాన్ని ఈరోజు (డిసెంబర్ 6) ప్రకటించనుంది. అయితే, ఈసారి కూడా కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచే ఛాన్స్ ఉంది.